DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 8 న జరిగే ఇళ్ల పట్టాల ‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

*3,38,144 ఇళ్లకు రూ.1,323 కోట్లు చెల్లించాలని ఆదేశాలు* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  02, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8 à°¨

పంపిణీచేయనున్న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి

 à°µà±ˆà°¯à°¸à±‌.జగన్‌ సమీక్ష చేసారు. à°—à°¤ ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్లబకాయిలను చెల్లించాలని సీఎం నిర్ణయం చేసారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

 à°®à±Šà°¤à±à°¤à°‚ 3,38,144

ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. 

గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా పొరపాట్లకు

తావివ్వకుండా ఈచెల్లింపులు చేయాలని ఆదేశాలు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని తెలిపారు. మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై

సీఎం సమీక్ష జరిపారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సూచించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు

నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగితెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు

ఉండేలా చూస్తున్నామన్నారు.ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని

సమకూర్చాలన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం:అన్నారు. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు.

పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలన్నారు. పేదలకోసం చేస్తున్న

ఈకార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు

చేపడుతున్నాం అన్నారు. 

ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకల్పనపైనా సీఎం సమీక్ష జరిపారు.  à°•à°¨à±€à°¸ దూరం పాటిస్తూ à°ˆ కార్యక్రమాన్ని

కొనసాగించాలన్నారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని తెలిపారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశం

గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌సహా అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam