DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిబంధనలు అతిక్రమించిన ఆలయ ఈఓ లపై కఠిన చర్యలు

*8 నుంచి గుళ్ళు తెరిస్తే పాటించాల్సిన రూల్స్ ఇవే. . .*

*భక్తులకు, ఈఓలకు దేవాదాయ శాఖా సూచనలు జారీ .* 

12 గంటల ముందు భక్తులకు ఎస్ ఎం ఎస్ పంపాలి. . .

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)

విశాఖపట్నం,  à°œà±‚న్  03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): à°ˆ నెల 8 తర్వాత దేశ వ్యాప్తంగా హిందూ ఆలయాలను భక్తుల కోసం జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర దేవాదాయ

ధర్మాదాయ శాఖ కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది.  à°ˆ నిబంధనలు అతిక్రమించిన ఆలయ ఈఓ లపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. à°ˆ మేరకు దేవాదాయ శాఖా ప్రత్యేక

కమిషనర్ పేరిట విడుదలైంది. 

భక్తులకు సూచనలు : 

ప్రతి ఆలయంలో ప్రవేశించి ప్రతి భక్తుని తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఏదేని గుర్తింపు కార్డు ఉండాలని

తెలిపింది
ప్రతి భక్తుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ముక్కు నోరు కనిపించని విధంగా ధరించాలని తెలిపింది 
ఆలయంలోకి ప్రవేశించే సమయానికి ఈ మాస్ కు తోనే

ఉండాలని తెలిపింది 
ఆలయంలోకి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే లోనికి వెళ్ళాలి అని తెలిపింది. ప్రతి భక్తుడు తోటి భక్తునికి మధ్య కనీసం ఆరు అడుగుల

దూరం పాటించాలని తెలిపింది భక్తులకు కేటాయించిన టైం స్లాట్ సమయంలోనే ఆలయ ప్రవేశం చేయాలని తెలిపింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆలయంలో కూడా ఆలయంలో అంతరాలయం

లేదా గర్భాలయ దర్శనాలు లేదని తెలిపింది. 

అన్న ప్రసాదం ప్రసాదు ఉండదని కేవలం అన్నదాన సత్రాలు కేంద్రాల్లో ప్యాకెట్లు ద్వారా అందించాలని తెలిపింది 
/> బహిరంగ ప్రదేశాల్లో పొంగలి తయారు చేయడం నిషేధించింది కేవలం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రసాద్ సెంటర్ లోనే వీటిని తయారు చేయాలని తెలిపింది

అర్చకులు,

సిబ్బందికి నిబంధనలు: . .. 

భక్తులకు ఇచ్చే శఠారి, తీర్థం పరిస్థితులకు అనుకూలంగా ఆలయ అర్చకులు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది 
ఈ పరిస్థితులు సాధారణ దిశకు

చేరుకునే వరకు సాగుతాయని తెలిపింది గంటకు 300 మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని నిబంధన విధించింది

ఆలయంలో ఆరడుగులు కనీస దూరం ఉండేలా సర్కిల్

బాక్స్ లను అను గీసి వాటి ద్వారానే భక్తులను అనుమతించాలని సూచించింది.
కేవలం రెండు లైన్లు మాత్రమే భక్తుల కోసం నడపాలని తెలిపింది ఒకటి ఉచిత దర్శనం రెండు

ఆర్జిత దర్శనం ఉండాలని తెలిపింది.
టైం స్లాట్ కేటాయించబడిన భక్తులకు à°† సమయాల్లోనే ఆలయంలోకి అనుమతివ్వాలని తెలిపింది 
మండపంలో 30 మందికి మించి భక్తులను ఎట్టి

పరిస్థితుల్లోనూ సూచించింది
భక్తులను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ధర్మల్ స్క్రీన్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది 
ప్రవేశద్వారం వద్ద వీటిని

వినియోగించిన తర్వాతే భక్తులను ఆలయంలోనికి అనుమతించాలా అని తెలిపింది
ఆలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్లు ధరించాలని తెలిపింది.
ఆలయ ప్రాంగణంలో

శానిటైజర్లు, నీరు తప్పనిసరిగా ఉంచాలని తెలిపింది. 

క్యూ లైన్లు అదుపు చెయ్యడానికి,  à°®à±†à°Ÿà°²à± గొట్టాలను వినియోగించవచ్చని తెలిపింది. 
టైం స్లాట్ ఇచ్చిన

భక్తులకు 12 గంటల ముందుగా ఎస్ ఎం ఎస్ ద్వారా సమాచారం ఇవ్వాల్సిన భాద్యత ఆలయ నిర్వాహకులదేనని తెలిపింది.

గర్భాలయ, అంతరాలయం దర్శనాలను రద్దు చెయ్యాలి.
ఎవరికైనా

ఉష్ణోగ్రత ఉన్నట్టయితే తక్షణం వైద్య సహాయం కోసం 112 కు ఫోన్ చెయ్యాలని తెలిపింది.
ఈ పూర్తి నిబంధలను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ముద్రించి బోర్డు పై పెట్టాలి.
ఈవో లు

ప్రతి అరగంటకి కోవిద్ పై అవగాహనా పెంచుతూ ఉండాలి
పొంగల్ షెడ్ ల్లో సగం మందే ఉండాలి, ప్రతి ఇద్దరికీ మధ్య దూరం 6 అడుగులు ఉండాలి.

పూజా మండపాల్లో :. .. 

సేవా

టికెట్లు, అన్ని ఆర్జిత సేవ టికెట్లను కేవలం 30 శాతం మాత్రం అమ్మవలసి ఉంటుంది. 
అన్ని ఆర్జిత సేవా టికెట్ కచ్చితంగా ఆన్లైన్ లో మాత్రమే బుక్ చెయ్యవలసి ఉంటుందని

తెలిపింది. 

ఇవే నిబంధనలు కల్యాణకట్టలు, ఆర్జిత సేవా ప్రాంతాలు, వసతి గృహాలు, సామాను భద్ర పరిచే ప్రాంతాలు, చెప్పుల స్టాండ్ లు, మొబైల్ స్టాండ్ లు, తదితర అన్ని

మండపాలకూ వర్తిస్తుందని తెలిపింది. 

కల్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి తలనీలాలు మొక్కు తీర్చిన ( గుండు చేసిన) తర్వాత కచ్చితంగా చేతులు

శానిటైజర్ తో కడుక్కోవాలి తెలిపింది. 

ఈ నిబంధనలు అతిక్రమించిన ఆలయ ఈఓ లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam