DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్ జి టి  కీలక ఆదేశాలు*

*రూ. 50 కోట్లను బాధితుల పరిహారానికి వాడాలి. . .*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): విశాఖపట్నం శివారు ప్రాంతం లోని ఆర్ ఆర్

వెంకటాపురం లోని ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ ప్రమాదం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను

ఇస్తుందని ధర్మాసనం. నవంబర్ 3à°•à°¿ తదుపరి విచారణను వాయిదా వేసింది. గురువారం లిఖితపూర్వక ఆదేశాలు వెలువరించిన  à°…ంశాలు ఇవే. . .


కలెక్టర్ వద్ద ఉంచిన రూ. 50 కోట్లు

పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలి.

కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి

విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్దర ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలి.

రెండు నెలల్లో కమిటీ పునరుద్ధర ప్రణాళిక ఇవ్వాలి.

కేంద్ర పర్యావరణ

శాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలి.

పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీ ఏర్పాటు.

కమిటీలో  à°•à±‡à°‚ద్ర పర్యావరణ శాఖ, కేంద్ర

కాలుష్య నియంత్రణ మండలి, నీరి సంస్థ నుంచి ప్రతినిధులు.

కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయాలి.

రెండు నెలల్లో కమిటీ

నివేదిక ఇవ్వాలని ఆదేశం.

అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి రాష్ట్ర సీఎస్ చర్యలు

తీసుకోవాలి.

తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలి.

ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభం

కాకుడదు.

చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే సంస్థ తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తుంది.

ప్రమాదక రసాయనాలతో కూడిన ప్లాంట్లలో భవిష్యత్ లో

పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి, నిరోధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.

ఆ కమిటీ తనిఖీలు చేసి మూడు నెలల్లో నివేదిక

ఇవ్వాలి.

సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరంపై ఎన్జీటీ ఆగ్రహం.

సుమోటోగా కేసు తీసుకునే అధికారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ కు

ఉందని స్పష్టీకరణ.

పర్యావరణానికి హాని కలిగి చర్యలు జరిగినప్పుడు ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని ఘాటు వ్యాఖ్య.

విచక్షణాధికారాలకు లోబడే సుమోటో

గా కేసు తీసుకున్నట్లు స్పష్టం చేసిన ఎన్జీటీ.

హైకోర్టు, ఇతర ఫోరాలు వేసిన కమిటీలు చేసే విచారణల్లో ఎలాంటి విభేదం ఉండదన్న ఎన్జీటీ.

ఏ కమిటీ విచారణ అదే

చేస్తుందని స్పష్టీకరణ.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam