DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ యు లో బయట పడిన అంతర్గత విభేదాలు, రిజిస్ట్రార్ తొలగింపు

విశాఖపట్నం, జులై 7 , 2018 (DNS Online ): ఆంధ్ర విశ్వకళాపరిషత్ నూతన రిజిస్ట్రార్ గా డాక్టర్ కె. నిరంజన్ నియమితులయ్యారు. ఈ ఆదేశాలు అత్యంత చాకచక్యంగా ఈ నియామకాన్ని జరిపినట్టు

తెలుస్తోంది.గత కొంత కాలంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఉన్నతాధికారుల మధ్య వెలుగు చూస్తున్న అంతర్గత విభేదాలు తారాస్థాయి కి చేరుకున్నాయి. ఏ యు ఉప కులపతి డాక్టర్

జి. నాగేశ్వర రావు, రిజిస్టర్ డాక్టర్ ఉమా మహేశ్వర రావు ల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయి కి చేరుకోవడం తో అయన పై వేటు వేయడం జరిగింది. గతం లో బీజేపీ టిడిపి లు

మిత్ర బృందం à°—à°¾ ఉన్న సమయం లో కేంద్రం లోని బీజేపీ తో సత్సంబంధాలు కల్గిన వ్యక్తి వీసీ కవడంతో,  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• తెలుగుదేశం సానుభూతి పరుడు ఉమా మహేశ్వర రావు ను

రిజిస్ట్రార్ గా నియమించుకోవడం జరిగింది అయితే ఇటీవల కాలం లో రెండు పార్టీల మధ్య బంధాలు తెగిపోయి విడాకులు పుచ్చుకోవడం తో ఇరు వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ

క్రమం లోనే పార్టీలకు అనుగుణంగా నడుచుకునే వీరు కూడా తమ స్థాయి ల్లో ఈ విభేదాలను చాటుకుంటున్నారు. ఇదే క్రమం లో ఇంతకూ ముందు జరగవలసిన ఏ యు స్నాతకోత్సవం లో

బీజేపీ కి అనుకూలంగా ఉండే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షునికి ఏ యు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు వీసీ నిర్ణయించడం ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద దుమారాన్నే లేపింది. దీనికి

ప్రధాన కారణం ఆంధ్రా కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇవ్వడం కుదరదు అని తేల్చడమే కాక, విశాఖ కేంద్రం గా రైల్వే జోన్ కూడా ఇవ్వక పోవడం తో ప్రజల్లో నిరసన భావం

వచ్చిన తరుణంలో బీజేపీ వ్యక్తికీ ఏ యు డాక్టరేట్ ఎలా ఇస్తారనే ప్రశ్నకు వీసీ చేతులెత్తేశారు. తదనంతరం అవకాశం కోసం చూసిన వీసీ కి రిజిస్టర్ పదవి కాలం ముగియడం

బాగా కలిసి వచ్చింది. దీంతో ప్రస్తుత రిజిస్టర్ వెలగ పూడి ఉమా మహేశ్వర రావు ను తొలగించి, నూతన రిజిస్టర్ గా ఫిజిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ కె. నిరంజన్ ( తనకు

అనుకూలురు) ని నియమించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam