DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బస్సులను అనుమతించింది, ఇతర రాష్ట్రాలకు సీఎస్ లేఖ

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  05, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): తమ రాష్ట్ర ప్రజా రవాణా బస్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎస్ నీలం

సాహ్ని, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖను రాశారు. ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రజలను అక్కడకు చేర్చడానికి, ఆయా రాష్ట్రాల్లో

ఉండిపోయిన ఆయా రాష్ట్రాల ప్రజలను ఆంధ్రా కు చేర్చడానికి ఈ బస్సులను అనుమతించాలని కోరారు. 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపించాలని భావిస్తున్న

ప్రభుత్వం, ఇదే విషయాన్ని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకూ తెలియజేసింది. తమిళనాడులో మాత్రం కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రాష్ట్రం ఇతర రాష్ట్రాల వారిని

అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో తమిళనాడుకు మాత్రం ఆమె లేఖను పంపలేదని తెలుస్తోంది.

ప్రైవేటు వాహనాలు, రైళ్లలో భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో, వారి

వివరాలు సేకరించడం కష్టంగా ఉందని వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం కు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వెంటనే బస్సులను అనుమతించాలని వారు రవాణా శాఖను

కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రం అంతర్రాష్ట్ర ప్రయాణికులను అనుమతిస్తున్నప్పటికీ, బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంలో స్పష్టమైన

విధానాన్ని తెలంగాణ ప్రకటించాలని ఏపీ కోరుతోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని, సోమవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం అవుతాయని

సమాచారం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam