DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  06, 2020 (డిఎన్ఎస్ ):*

శ్రీకాకుళం, జూన్ 6 : పాఠశాలల్లో చేపడుతున్న నాడు నేడు పనులను

త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. శ్రీకాకుళం మండలంలో కల్లేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో  à°°à±‚.18.25 లక్షలతో చేపట్టిన

నాడు నేడు పనులను కలెక్టర్ శని వారం పరిశీలించారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. కార్పోరేట్ తరహాలో పాఠశాలలు కనువిందు చేయాలని సూచించారు. ప్రతి

విద్యార్ధి ప్రభుత్వ పాఠశాలలోనే చేరే విధంగా పరిస్ధితులు ఉండాలన్నారు. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం క్రింద వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవడం చిన్నారుల

బంగారు భవితకు నాంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ, మద్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఎటువంటి ఫీజు

తల్లిదండ్రులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. నాడు నేడు కార్యక్రమంలో చేపడుతున్న పనుల వలన పాఠశాలల్లో ఆహ్లాదకర పరిస్ధితులు ఏర్పడతాయన్నారు. ఆంగ్ల మాద్యమ

బోధనకు ప్రభుత్వం ఉపక్రమించే దిశగా ఉండటం, పాఠశాలలో మంచి వాతావరణం కలుగజేయడం ద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుండి అధిక సంఖ్యలో విద్యార్దులు చేరుతారని అందుకు

తగిన విధంగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. నాడు నేడు క్రింద పనులు చేస్తున్న ప్రతి పాఠశాలలో  à°—్రానైట్ ఫ్లోరింగు వేయాలని, భవనాలకు మంచి సందేశాత్మకంగా

ఉండే చిత్రాలతోపాటు ఆహ్లాదాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించే సందేశాత్మక చిత్రాలు ఉండాలన్నారు. చిన్నారులు బడిని విడిచిపెట్టి వెళ్ళలేని స్ధితి

ఉండాలన్నారు. మనస్సుకు ఆహ్లాదం ఉంటే ప్రశాంతంగా ఉండి విద్య పట్ల దృష్టిసారిస్తారని అన్నారు. తరగతి గదులు, భవనాలు మనోహరంగా ఉండాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం

చేయుటకు భోజన శాల ఉండే పాఠశాలల్లో భోజన శాల ప్రత్యేక వాతావరణం కనిపించాలన్నారు. మరుగుదొడ్లు స్టార్ హోటల్ కు తీసిపోరాదని స్పష్టం చేసారు. మంచి నాణ్యమైన పరికరాలు

వినియోగించాలని, రన్నింగు వాటర్ కల్పించాలని ఆదేశించారు. ఆధునాతన మోడల్ ఉండే ఎల్.ఇ.డి విద్యుత్ దీపాలు, స్విచ్ లు, ఫ్యాన్ లు ఉండాలన్నారు. పనుల్లో ఎటువంటి

పరిస్థితుల్లోనూ నాణ్యత లోపం ఉండరాదని స్ఫష్టం చేసారు. పనులు త్వరగా చేపట్టాలని అన్నారు. జిల్లాలో వివిధ కారణాల వలన నాడు నేడు పనుల పురోగతి తక్కువగా ఉందని వేగం

పెంచాలని చెప్పారు. 
    à°ˆ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర à°•à°³, విద్య, సంక్షేమ మౌళికసదుపాయల అభివృద్ధి సంస్ధ కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర

రావు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కిరణ్ కుమార్, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటి సభ్యులు, తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam