DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ఆలయాలకు నష్టం రావడానికి వ్యాపార కేంద్రాలా అవి?

*హిందూ ఆలయాలకు నష్టం రావడానికి వ్యాపార కేంద్రాలా అవి?*

*గత 2 నెలల్లో గుళ్ళకి లక్షలు, కోట్లల్లో నష్టం వచ్చిందా ట!!*

*గుడిలో ముడుపులు కచ్చితంగా

వెయ్యాలని రూలు ఉందా?* 

*ఈఓల ప్రకటన ఆశ్చర్యకరం... హుండీల్లో డబ్బులు పడకపోతే.* 

*దేవాదాయ శాఖను వ్యాపారకేంద్రాలు à°—à°¾ మార్చారు.: ధార్మిక సంఘాలు* 

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):*  à°†à°¦à°¾à°¯à°‚ నష్టం వచ్చేది కేవలం వ్యాపార కేంద్రాల్లోనే అనే విషయం అందరికీ తెలిసిందే.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గత 80 రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపార కేంద్రాలనూ మూసేసారు. అదే విధంగా హిందూ దేవాలయాలు కూడా భక్తులకు ప్రవేశం

లేకుండా మూసి వేసి, కేవలం ఏకాంతంలో అర్చనలు, నిర్వహించారు. 

ఆలయాలు  - ఆదాయం : . . . . . .

హిందూ దేవాలయాల్లో భక్తులు తమ మొక్కులు, ముడుపులు అక్కడ ఉన్న హుండీల్లో

వేసి ఆలయంలోని దేవి దేవతలా పట్ల భక్తిని చాటుకుంటారు. అయితే ఇవి భక్తులు స్వచ్చందంగా, తమ ఇష్ట పూర్వకంగా ఇచ్చేవి మాత్రమే. ఎవ్వరూ బలవంతంగా వసూలు చెయ్యడానికి

వీల్లేదు. హుండీల్లో భక్తులు వేసే డబ్బులు, ఇతర ముడుపులను సేకరించి, వాటి ని ఆలయ ఖర్చులకు వెచ్చిస్తుంటారు. ఆలయాల్లో ప్రతి నెల పెట్టె ఖర్చులు ఎంత ఉంటుందో

కచ్చితంగా లెక్క ఉంటుంది.

వీటికి అదనంగా గుళ్ళల్లో అర్చనలు, ఆర్జిత సేవలు వంటి వాటికీ టికెట్లు అమ్మడం వల్ల, అన్నదాన పథకాలకు విరాళాలు వసూలు చెయ్యడం వంటి

వాటితో ఆదాయాన్ని పొందుతుంటారు. 

అయితే భక్తులు హుండీల్లో వేసే డబ్బులకు మాత్రం కచ్చితమైన లెక్క ఉండదు. కొందరు ఒక్క రూపాయి వేస్తారు, మరికొందరు లక్ష

రూపాయలు వేస్తారు. ఇది వాళ్ళ ఇష్టం. à°ˆ 80 రోజుల పాటు ఆలయాల్లో ఎటువంటి ముడుపులు, మొక్కుబడులు పడలేదు. కాబట్టి ఆదాయం కనపడడం లేదు. 

ఈఓ ల ప్రకటనలు ఆశ్చర్యకరం: . .

.

అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఆలయాల ఈఓ లు చేసిన ప్రకటనలు హిందూ దేవాలయ వ్యవస్థను పూర్తి బ్రష్టుపట్టించే విధంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రకటనలు ఇవే: . .

కరోనా కట్టడి కాలంలో ఆలయాలకు భారీగా ఆర్ధిక నష్టం వచ్చింది అని. ఆలయాలకు నష్టం రావడం ఏంటి?  à°µà±€à°³à±à°³ లెక్కలో ప్రతి రోజూ ఇంత ఆదాయం హుండీలో పడాలి అని నిబంధన ఉందేమో

మరి. 

ప్రతి ఆలయానికి ఇంత ఆదాయం రావాలి అని వీళ్ళు లెక్కలు వెయ్యడం ఏంటి? భక్తుల నుంచి బలవంతంగా వసూలు చేస్తారా . . . ఆలయాలు పూర్తిగా ఆధ్యాత్మిక నమ్మకాలతో

నడిచేవి. దాతలు ఇచ్చిన లక్షలాది ఎకరాల భూములను చాలామంది కబ్జా చేసి, భోజనం చేసేస్తే. . .ఈ ఈఓ లు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ భక్తుల మీద మాత్రం ఆర్థిక

భారాన్ని వడ్డించేందుకు లెక్కలు గట్టిగా వేస్తున్నారు. 

హుండీల్లో డబ్బులు పడకపోతే. . .. 

ఇటీవల కాలంలో దేవాదాయ శాఖా ఉద్యోగులు చేస్తున్న మహామహా

దోపిడీలను బాగా గమనించిన భక్తులు ఏ ఆలయ హుండిలోనూ డబ్బులు వెయ్యక పొతే ఈవోలు ఏమి చెయ్యగలరు. దేవాదాయ శాఖను వ్యాపారకేంద్రాలు గా మార్చారు. . కొన్ని ఆలయాల్లో ఆదాయం

లేక జీతాలకు కూడా వెతుక్కోవలసిన పరిస్థితులు చూసాం. భక్తి తో  à°šà±†à°¯à±à°¯à°µà°²à°¸à°¿à°¨ ఉద్యోగాలని ఆర్ధిక వ్యాపారాలతో ముడిపెట్టడం భక్తుల నుంచి విమర్శలు

ఎదుర్కొంటున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam