DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల క్షేత్ర ఆలయం ఈఓ గా భ్రమరాంబ భాద్యతలు

*పలు ఆరోపణలతో వెంకటేశ్వర రావు మాతృ సంస్థ కు బదిలీ*    

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూన్ 10, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల

ఇలవేల్పు సింహాచల క్షేత్రం లో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా డి. భ్రమరాంబ బుధవారం భాద్యతలు చేపట్టారు. గత రాత్రి విడుదలైన

ఆదేశాల ప్రకారం ఆమె à°¬à±à°§à°µà°¾à°°à°‚ భాద్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ( ఆర్ జె సి) à°—à°¾ ఉన్న ఈమెను పూర్తి స్థాయి ఇంచార్జి

అధికారాలతో సింహాచల క్షేత్ర ఈఓ గా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ జారీ చేసారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె సింహాచలం

లోని ఈఓ కార్యాలయంలో భాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం లో మాజీ ఈఓ వెంకటేశ్వర రావు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. గతం లో ఈమె సింహాచల క్షేత్రానికి

తాత్కాలిక ఈఓ గాను, బురుజు పేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ గానూ మంచి సేవలు అందించారు. ఇంతవరకూ ఈవో గా ఉన్న వెంకటేశ్వర రావు ను పలు వివాదాలు,

ఆరోపణల నేపథ్యంలో మాతృ సంస్థకు పంపిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

లాక్ డౌన్ సమయంలో వచ్చిన చందన ఉత్సవ సమయంలో పలువురు అనుమతి లేకుండా ఆలయం లో

ప్రవేశించడం, ఒక ప్రజా ప్రతినిధి బంధువులకు కొండపై అక్రమ త్రవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం, దేవస్థానానికి చెందిన భూములను ప్రజా ప్రతినిధి బంధువులకు (

ప్రయివేట్ వ్యక్తులు ) అనుభవించేందుకు అనుకూలంగా ఉన్నారని, తదితర ఆరోపణల పై ఈయన్ని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam