DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ నలుగురం రైల్ రోకో చేద్దాం రండి : బాబు కి పవన్ పిలుపు

టిడిపి చేతగాని తనం వల్లే రైల్వే జోన్ రాలేదు.  

విశాఖపట్నం, జులై 7 , 2018 (DNS Online ) : విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించడానికి 
నాతో కలిపి మరో ముగ్గురు

సరిపోతారని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖ సాగర తీరం లో జన సేన నిర్వహించిన నిరసన కవాతు ముగింపు సభలో అయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పోరాటం

చేసిన జనానికి ఊరట కల్పిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన కుమారుడు నారా లోకేష్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,

తో పాటు తానూ కూడా నలుగురు కలిసి రైల్ రోకోలు, నిరసనలు చేస్తే ఎందుకోసం కేంద్రం దిగిరాదు అని ప్రశ్నించారు. ఈ రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా

అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం వద్ద ప్రస్తావన తేలేదన్నారు. ఆ పార్టీ అగ్రనేత కె. ఎర్రన్నాయుడు పార్లమెంటరీ

పార్టీ రైల్వే కమిటీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారని, మరి ఆనాడు విశాఖ జోను ఈ తెలుగుదేశం పార్టీకి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అయన హయం లో రైల్వే జోన్ కాదు, కనీసం

అయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నగరానికి కనీసం రైల్వే స్టేషన్ కూడా తేలేక పోయారన్నారు. అప్పయ్య దొర మూడు దశాబ్దాల క్రితం శ్రీకాకుళం కు రైల్వే స్టేషన్

కావాలి అని అడిగారు, ఆ తర్వాత దీని గురించి అడిగిన నాధుడే లేదన్నారు. పైగా ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం వారే దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చారన్నారు. ఇప్పుడు దొంగ

దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.                                     

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam