DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజిలెన్స్ దాడులు: . రేషన్ డిపో నుంచి 3 టన్నుల బియ్యం స్వాదీనం

విశాఖపట్నం, జూలై 7 , 2018 (DNS Online ):  à°µà°¿à°¶à°¾à°– జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం వద్ద రేషన్ డిపో పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు శనివారం ఉదయం దాడులు నిర్వహించారు.

à°ˆ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సి.ఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం  à°¸à°¬à±à°¬à°µà°°à°‚ మండలం మొగలిపురం వద్ద ప్రభుత్వ చౌక దుకాణం డిపో నంబర్ 1

నిర్వహిస్తున్న సత్యరావు తూనికల్లో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడన్న సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ డి.కొటేశ్వరావు అదేశాలతో

పౌర సరపరాల అదికారులు సంయుక్తంగా దాడులు నిర్వహింఛామన్నారు . రేషన్ డిపో నిర్వాహకుడు తూనికల్లో ఇరవై కిలోల బియ్యానికి ఒక కిలో పది కిలోల బియ్యానికి అర కిలో

వత్యాసాన్ని గుర్తించమన్నారు . అంతే కాక డీలర్ సత్యరావు అతడి సోదరుడు లక్ష్మణ్ అతడి కుమారుడు సత్యవరపు శ్రీనివసరావు అదే గ్రామం బోడెమ్మ గుడి సమీపంలో

అనధికారికంగా మరో షాప్ ను ఏర్పాటు చేసి అందులో నిల్వ వుంచిన 3 టన్నుల పిడిఎస్ బియాన్ని సీజ్ చేసి పౌర సరపరాల శాఖ అదికారులకు అప్పగించమన్నారు . అదేవిదంగా ప్రభుత్వం

సరపర చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ముగ్గురిపై 6 ఎ కేసు నమోదు చేసామన్నారు . ఈదాడుల్లో పౌర సరపరాల శాఖ డిప్యూటీ తహశీల్ధార్ లీలాకుమారి

సిబ్బంది పాల్గున్నారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam