DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పరిస్థితి అదుపు కోసం 4 గురు ఐఏఎస్ లు ఢిల్లీ కి బదిలీ*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  14, 2020 (డిఎన్ఎస్):* దేశ రాజధాని న్యూఢిల్లీ లో కరోనా పరిస్థితి ని అదుపు చెయ్యడానికి వివిధ ప్రాంతాల నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులను ఢిల్లీ కి బదిలీ చేస్తూ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసారు. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ

నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కేంద్రమంత్రి తో చర్చలు ముగిసాయో లేదో... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హుటాహుటిన నలుగురు ఐఏఎస్‌లను ఢిల్లీకి బదిలీ చేశారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి సహాయకారులుగా ఉండాలంటూ వారిని ఆదేశించారు. 
అండమాన్

నికోబార్‌లో విధులు నిర్వర్తిస్తున్న అవనీశ్ కుమార్, మోనికా ప్రియదర్శినితో పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న గౌరవ్ సింగ్ రాజావత్, విక్రమ్ సింగ్ మల్లిక్‌ను ఢిల్లీకి బదిలీ చేస్తూ అమిత్‌షా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అంతకు పూర్వం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లెఫ్టినెంట్ గవర్నర్

అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో పాటు మరికొంత మంది సీనియర్లతో షా భేటీ అయ్యారు. రాబోయే 6 రోజుల్లో కరోనా పరీక్షలను మూడు రేట్లు పెంచుతామని, రాబోయే రెండు రోజుల్లో కరోనా పరీక్షలను రెట్టింపు చేస్తామని షా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత కంటేయిన్‌మెంట్ జోన్లలోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద

టెస్టింగ్ సౌకర్యాలు ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. అంతేకాకుండా పడకలుగా 500 రైల్వే కోచ్‌లను కేటాయిస్తామని అమిత్‌షా ప్రకటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam