DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ లో మరో సారి లాక్ డౌన్ కు అవకాశం ఉందా? 

*పరిస్థితి చెయ్యిదాటిందని ప్రభుత్వం భావిస్తోందా?*
 
*రాష్ట్రాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాద్యతారాహిత్యమే కారణమా?*

*15 న సీఎం ల మీటింగ్ తో ప్రధాని తీసుకునే నిర్ణయం ఏంటి ?*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  14, 2020 (డిఎన్ఎస్):* దేశ వ్యాప్తంగా కరోనా పెచ్చుమీరుతున్న

నేపథ్యంలో భారత్ లో మరో సారి లాక్ డౌన్ కు అవకాశం ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ కు అవకాశం ఉందా లేదా అనే విషయం భారత్ ప్రధాని సోమవారం తీసుకోబోయే నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. ఐదు విడతలుగా విధించిన లాక్ డౌన్ తదుపరి దేశ వ్యాప్తంగా కేసులు ద్విగుణం అవుతున్న నేపథ్యంలో

పరిస్థితి చెయ్యిదాటిందని ప్రభుత్వం భావిస్తోందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 

దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాద్యతారాహిత్యమే కారణంగానే కాపాడుతున్నాయి. ముందుగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతోనే ఒక్కసారిగా ప్రజలు రెచ్చిపోయి మరీ రోడ్లపైకి వచ్చి కరోనా

వ్యాప్తికి ఒక రకంగా కారణం అయ్యారన్నది వాస్తవం. తదుపరి పూర్తి స్థాయి లో ఉదయం వేళల్లో నిబంధనల సడలింపు తో  ప్రధానంగా ప్రజలు చాలామంది కనీస దూరం ఎక్కడా పాటించక పోవడం తో పాటు ముఖానికి మాస్క్ లు కూడా సరిగ్గా ధరించక పోవడమే వైరస్ వ్యాప్తి కి కారణంగా తెలుస్తోంది.  మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తున్నట్టు

ఆదేశాలు జారీ చేసినా ప్రజల్లో పెద్దగా భాద్యత మాత్రం కనపడడం లేదు. 

ఈ క్రమంలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ( జూన్ 15 ) న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించబోయే వీడియో సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

అయితే పూర్తిగా మరోసారి లాక్ డౌన్ చేసేస్తే భారత ఆర్థిక

వ్యవస్థ పూర్తిగా కుంటూ పడిపోయి ఇప్పట్లో కోలుకునే అవకాశం లేక పోవడం తో ప్రభుత్వం మరోసారి దీర్ఘాలోచనలో పడింది. 

కేంద్ర రాజధాని న్యూఢిల్లీ,  ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. 

ముంబై ఢిల్లీ లో పరిస్థితులు

చేయిదాటిపోయేలా ఉన్నాయి. బాధితులకు వైద్యం అందించడానికి బెడ్లు కూడా సరిపోయే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో నిన్న అత్యవసర సమీక్ష నిర్వహించారు. 

ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో ప్రధాని జరిపిన సమీక్షలో కరోనా

వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలా..అన్న అంశంపై కూడా చర్చించినట్టు పీఎంఓ వర్గాల సమాచారం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam