DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శంఖుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి పై వైకాపా క్యాడర్ రాళ్ళ దాడి. .

*శంఖుస్థాపన కు టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడం నిషేధమా?*

*రోడ్డుపైనే ఎమ్మెల్యే బైఠాయింపు, రంగంలోకి పోలీసులు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ( తెలుగు దేశం ఎమ్మెల్యే) తన నియోజక వర్గంలో

జరుగుతున్నా ఒక శంఖుస్థాపనకు హాజరైన నేపథ్యంలో స్థానిక అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లతో దాడి చెయ్యడంతో రోడ్డుపైనే బైఠాయించారు. వివరాల్లోకి వెళితే. . . సోమవారం విశాఖ తూర్పు నియోజక వర్గం పరిధిలోని అడవివరం రోడ్ లోని రామకృష్ణాపురం లో జరుగుతున్నరోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్నీ

నిర్వహించేందుకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అతిధిగా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకొని కార్యక్రమాన్ని అడ్డుకుని, ఎమ్మెల్యే సహా ఇతర కార్యకర్తలపై రాళ్ళ దాడికి ప్రయత్నించారు. దీంతో కొంత మంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ  కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్

కి తరలించారు. 

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తమ కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నట్టు రోడ్డు పైనే బైఠాయించారు.  ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే లు తమ నియోజక వర్గంలో జరిగే అభివృద్ధి పనుల శంఖు స్థాపన కు కూడా హాజరు కాకూడదనే ఆదేశాలు ఉన్నాయా అని

ప్రశ్నించారు. 

విషయం ముదురుతుండడంతో స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam