DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2021 మహానాడు చంద్రబాబు కి జైల్ లోనే : గుడివాడ అమర్

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):* రాబోయే 2021 మహానాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు  జైల్ లో చేస్తారని,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ జోస్యం చెప్పారు. సోమవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన బాబు అండ్ కో వైఖరి పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖపట్నం శివారు గ్రామం లోని  ఎల్జీ ఫాలీమార్స్ మృతులకు ముఖ్యమంత్రి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన మూడు రోజుల్లోనే వారికీ అందించడం జరిగిందన్నారు. తెలుగు దేశం తరపున మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి యాబై

వేల రూపాయలు ఇవ్వమని చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలును ఆదేశిస్తూ లేఖ రాయడం సిగ్గు చేటు అన్నారు. ఇది కేవలం కంటితుడుపుకేనా ఈ సహాయం అంటూ వ్యాఖ్యానించారు. అతని పాలనలో స్వయంగా అతను పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో జరిగిన గోదావరి పుష్కరాల్లో మరణించిన 29 మందికి ఏమాత్రం పరిహారం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్

చేసారు. సాయం చెయ్యడానికి అతనికి చేతులు రావని, ఎదుటి వాడు సాయం చేస్తే మాత్రం తట్టుకోలేడన్నారు.  

తెలుగు దేశం పార్టీ హయాంలో  ప్రతి ష్టాత్మకంగా చేసుకునే మహానాడు కార్యక్రమాన్ని 2020 లో  జూమ్ యాప్ లో చేసాడని, 2021 లో జైల్లో చేస్తాడన్నారు. 

ప్రభుత్వ సొమ్మును దోచేసిన వారిని అరెస్ట్ చేస్తే

అచ్చెన్నాయుడు ని  పరామర్శించ డానికి సమయం  దొరికిందా అని ప్రశ్నించారు. కానీ పాలిమర్స్ లో బాధితులను పరామర్శించేందుకు సమయం దొరకలేదా అని మండిపడ్డారు. 

అచ్చం నాయుడు బీసీ లకు బ్రాండ్ అంబాసిడరా?. తప్పుడు నిర్ణయానికి అతన్ని ఏసీబీ అరెస్ట్ చేసిందని, దీనిపై మాట్లాడేందుకు నోరెలా

వచ్చిందన్నారు.  

ఈసీఐ  కుంభకోణంలో ఉన్నవారిని, ఫోర్జరీ చేసిన అక్రమ బస్సులను నడిపిన వారిని అరెస్ట్ చేసామని,  ఒక వర్గానికి న్యాయం చెయ్యమని కోరుతూ తన ఇంట్లోనే ఉద్యమం చేసిన ముద్రగడ్డ పద్మనాభం ను ఎలా అరెస్ట్ చేశారో మర్చిపోయారా. అని ప్రశ్నించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam