DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోమ్ క్వారంటీన్ ఉల్లంఘనకు నోటీసులు, శ్రీకాకుళం కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 15, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలో హోమ్ క్వారంటీన్ ఉల్లంఘనలకు నోటీసులు జారీ చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు  జిల్లాలో విస్తృతమైన చర్యలు చేపట్టిన చర్యలను ఆయన సోమవారం పర్యవేక్షించారు. లాక్ డౌన్

లో సైతం జిల్లాలో ప్రజలు మంచి సహకారం అందించారని ఆయన అన్నారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు అధికం అయ్యాయని వారి నుండి వైరస్ వ్యాప్తి జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో కంటైన్మెంట్ జోన్లను  జిల్లా కలెక్టర్ నివాస్ సోమ వారం పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సంస్ధాగత క్వారంటీన్

కేంద్రాలు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు. ప్రస్తుతం హోమ్ క్వారంటీన్ కు వెళతామని అభ్యరిస్తున్న వ్యక్తులకు అనుమతిస్తున్నామని అయితే వారు నిబంధనల మేరకు కఠింగా పాటించడం లేదని సమాచారం అందుతుందని చెప్పారు. ఈ మేరకు హోమ్ క్వారంటీన్ ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేసామని వారిపై చట్టపరమైన చర్యలు

తీసుకుంటామని స్పష్టం చేసారు. ఇటీవల పలాస రైల్వే స్టేషన్ లో అనుమతి లేకుండా రైలు దిగిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇక మీదట కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. జిల్లాలో ఇప్పటికే బయట నుండి వచ్చిన వారి ద్వారా కరోనా వ్యాప్తి పెరిగిందని ఇది మరింత పెరిగే అవకాశం ఉందని

తెలిపారు. జిల్లా ప్రజలు అందించిన సహకారం వృధాగా మారుతుందని అన్నారు. దీనిని గమనించి బయట నుండి వచ్చిన వ్యక్తులు తమ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, గ్రామస్తుల ఆరోగ్యం దృష్ట్యా సురక్షిత చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉందని గుర్తించాలని, ఎక్కడా ఐదు గురు కంటే ఎక్కువ మంది ఉండరాదని

కలెక్టర్ అన్నారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై ఐపిసి 188 క్రింద, ఎపిడమిక్ చట్టం, విపత్తు యాజమాన్య చట్టం క్రింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే వారిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. మాస్కులు ధరించని వారిపై అపరాధ రుసుము విధించాలని కమీషనర్ కు ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో విస్తృతంగా

పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్యకు ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ల నుండి ఎవరూ బయటకు రాకూడదని, ఎవరూ లోనికి వెళ్లరాదని స్పష్టం చేసారు. ఆ ప్రాంత వాసులకు నిత్యావసరాలు, తాగు నీరు, సరుకులను మోబైల్ ద్వారా అందించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం నేర్చు కోవాలని, మాస్కులు

ధరించాలని, ఇది తమ బాధ్యతగా గుర్తెరగాలని ఆయన తెలిపారు. చేపలు, కూరగాయల మార్కెట్ ల వద్ద భౌతిక దూరం పాటించుటకు మార్కింగు వేయాలని, మద్యం దుకాణాల వద్ద విధిగా దూరం పాటించాలని, మాస్కులు, గొడుగులు ధరించాలని అన్నారు. దూరం పాటించడంలో పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లలో జ్వరం, దగ్గు, ఆయాసం తదితర

రుగ్మతలతో ఉన్నవారిని, వృద్ధులను గుర్తించాలని వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
          కంటైన్మెంటు జోన్లలో చేపడుతున్న పనులను, తీస్తున్న నమూనాలు తదితర వివరాలను వైద్య అధికారులు, వైద్య సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్ధ ఆరోగ్య అధికారి డా.జి.వెంకట రావు, ఉప

కార్యనిర్వాహక ఇంజనీరు దక్షిణా మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam