DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనీస దూరం పాటించడమే ప్రస్తుత తరుణోపాయం

*తూర్పు గోదావరి జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి హితవు*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):*  కరోనా మహమ్మారి సోకకుండా మనల్ని మనం పరిరక్షించుకునేందుకు కనీస దూరం పాటించడమే ఏకైక మార్గమని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి

పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి ని అదుపు చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న న్యాయశాఖ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. హార్లిక్స్ ఫ్యాక్టరీ, హెచ్.యు.ఎల్ సౌజన్యంతో 66 మంది సిబ్బందికి జిల్లా ప్రధాన

న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరలు చాచుకుని కూర్చుందని, అందరూ దీని పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న న్యాయశాఖ సిబ్బందికి నిత్యావసరాలు ఇచ్చేందుకు

హార్లిక్స్ ఫ్యాక్టరీ హెచ్.యు.ఎల్  ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ  కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ వెంకట ప్రసాద్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ కె.విఎల్.హిమబిందు, విశ్రాంత న్యాయమూర్తి కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ రుంజల వెంకట నాగమణి, డిఎల్ఎస్ఎ ప్యానల్ న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు, పిఎల్వీ

లక్కోజు ఓంకార్, హార్లిక్స్ ఫ్యాక్టరీ హెచ్.యు.ఎల్ ఈఆర్ మేనేజర్ రమణమూర్తి, హెచ్ ఆర్ మేనేజర్ గంటి శ్రీనివాసరావు, అనుదీప్ పౌండేషన్ సభ్యులు శ్రీనివాస్, మోజేష్, కృష్ణకుమార్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam