DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేర ప్రవృత్తి ఉన్నవారిపై పూర్తి నిఘా పెడతాం: పగో ఎస్పీ

*పగో జిల్లా ఎస్పి గా నారాయణ నాయక్ బాధ్యతలు స్వీకరణ* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి గా  కె.నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు విజయవాడ రైల్వే ఎస్పీగా,గుంటూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం

ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గల చెడు ప్రవర్తన కల్గిన రౌడీషీటర్ల పై కఠినంగా వ్యవహరిస్తామని, వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళలు బాలికలపై పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిపై దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని

తెలియచేసారు. జిల్లాలో రోడ్డు భద్రత కు ప్రాధాన్యత కల్పిస్తామని, జిల్లాలో ఎవరైనా జూదం, కోడి పందెములు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా మద్యం, ఇసుక అక్రమ రవాణాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా దాడులు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నాటుసారా

తయారీదారులు మరియు విక్రయదారుల పై నిఘా ఉంచి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్ట్ ల వద్ద మరింత భద్రతా కల్పించి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోకి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారా మద్యం అక్రమ రవాణాను పూర్తి గా నిరోధిస్తామన్నారు. 

పోలీస్

స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు పట్ల పోలీస్ అధికారులు మర్యాదగా నడుచుకునే లాగా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. స్టేషన్ కు నేరుగా వచ్చే ఫిర్యాదులు, డైల్ 100 కు వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేస్తామన్నారు. 

నేరాల సంఖ్య తగ్గించే నిమిత్తముగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని, కరోనా వైరస్

వ్యాప్తి చెందకుండా కంటోన్మెంట్ జోన్ నందు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. 

 డైల్ 100 కు వచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరమే న్యాయం చేకూర్చే లాగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలియజేసినారు. 

నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎస్పీ ని జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ

కరీముల్లా షరీఫ్, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్, ఏలూరు నరసాపురం కొవ్వూరు పోలవరం మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి మరియు పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి వారిని అభినందించారు.

అనంతరము జిల్లా ఎస్పి నారాయణ నాయక్  ఏలూరు రేంజ్ డిఐజి  కె.వి. మోహన్ రావు

ను  మర్యాద పూర్వకంగా కలిశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam