DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైయస్ఆర్ జయంతికి పేదలకు ఇళ్లు పంపిణీ: మంత్రి బొత్స

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):*  వైయస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున ప్రభుత్వం ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని,  రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అర్హులందరికీ సొంత ఇంటి వసతిని

కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణపు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.  

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్ఫం మేరకు, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని

చెప్పారు. 

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తదితరులతో సోమవారం నాడు చిలకలూరి పేటలో గృహ నిర్మాణల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు, అవినీతి తదితర కారణాలతో గృహాల నిర్మాణపు పనులు అసంపూర్తిగా ఉండిపోయాయని, అటువంటి

పరిస్థితులన్నిటిని చక్కదిద్దుతూ వాటిని త్వరతగతిన పూర్తి చేసి లబ్ధి దారులకు అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 
చిలకలూరిపేట నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 52 ఎకరాల్లో నిర్మిస్తున్న 5700 ఇళ్ల  నిర్మాణపు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు, డ్రైనేజి, మంచినీటి పైప్ లైన్ల వంటి మౌలిక వసతుల

గురించి ఆరా తీస్తూ, ఆ పనులను కూడా మంత్రి స్వయంగా చూశారు. ఈ పనులన్నిటినీ నిర్దేశిత కాలపరిమితిలో, వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam