DNS Media | Latest News, Breaking News And Update In Telugu

16 నుంచి అసెంబ్లీ, నల్లచొక్కాలతో రానున్న టిడిపి సభ్యులు

*తొలిసారి ఆన్ లైన్ లో సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం :. . .*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):* అత్యవసరంగా తప్పని సరి పరిస్థితుల్లో జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తెలుగు దేశం పార్టీ సభ్యులు నల్ల చొక్కాలతో హాజరుకానున్నారు. మంగళవారం నుంచి రెండు

రోజులు జరుగనున్న సమావేశాలను తొలుత బహిష్కరించాలని చర్చించినా, వీళ్ళు లేకుంటే కొన్ని బిల్లులు శాసన మండలి లో పాస్ చేసేసుకుంటారని చంద్రబాబు చెప్పడంతో హాజరవ్వాలని నిర్ణయించారు. 

కరోనా విస్తృతంగా పెరుగుతుండడంతో సభ్యులందరికీ అత్యవసరంగా కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసేసారు. అందుబాటులో ఉన్న

సభ్యులందరికి సోమవారం నాడే పరీక్షలు జరిపారు. 

పార్టీ నేతల అక్రమ అరెస్టులు, ఇసుక అక్రమాలు, మద్యం ధరల పెంపు, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ సిద్దపడుతోంది. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ పై టీడీపీ సభ్యులు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించనున్నారు.

 

తొలిసారి ఆన్ లైన్ లో గవర్నర్ ప్రసంగం :. . .

అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఆన్ లైన్ లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఎన్నిరోజులు సభ జరపాలన్నది బీఏసీ నిర్ణయించనుంది. 

రేపటి

సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో బలంగా వినిపించాలని వైసీపీ సభ్యులు నిశ్చయించుకున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam