DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార యంత్రాంగం పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలి

*జూలై 10 నుంచే పదో తరగతి పరీక్షలు: విద్యా మంత్రి సురేష్*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  15, 2020 (డిఎన్ఎస్):*  పదవ తరగతి పరీక్షలు ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని, పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామాత్యులు డాక్టర్  ఆదిమూలపు సురేష్

అధికారులను ఆదేశించారు. విజయవాడ లోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో పదో తరగతి పరీక్షల నిర్వహణ, సన్నాహాల నిమిత్తం ఆయా జిల్లా అధికారులతో పాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ, మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించి, వారి సలహాలు,

సూచనలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. . .

జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు : . . .

కరోనా మహమ్మారి కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జూలై 10 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం వంటి  జాగ్రత్తలు

పాటిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కరోనా నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ  పరీక్షలకు సిద్ధం అయ్యేలా ధైర్యాన్ని ఇస్తూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి కేంద్రానికి విద్యార్థులతో పాటు ఎక్కువమంది రాకుండా కట్టడి చేసేందుకు పోలీసువారి సహకారాలు తీసుకుంటామన్నారు. 

ఆరోగ్యం, నియంత్రణలకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ నుంచి, జిల్లా పరిపాలనశాఖల సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. 

రెడ్ జోన్లు, కంటైన్మంట్ జోన్ల  నుంచి పరీక్షలకు హాజరయ్యే

విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటుతో పాటు  ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

11 నుంచి ఇంటర్ సప్లమెంటరీ : . . . . 

అదే విధంగా జూలై 11 నుంచి 18 వరకు ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు  జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని

నిర్వహిస్తామన్నారు. 

పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని విద్యార్థులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ఒకసారి తప్పిపోతే మరో అవకాశం ఉందని, ఇవి మన సామర్ధ్యానికి పరీక్షలు అన్నారు. 

పిల్లలు భావోద్వేగానికి గురి కాకుండా తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో

 మంత్రితో పాటు పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam