DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాల్వన్ లోయ ముగ్గురు అమర వీరులకు బిగ్ సెల్యూట్

*అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం: జనసేనాని పిలుపు* 

*కల్నల్  సంతోష్ విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  16, 2020 (డిఎన్ఎస్):* వాస్తవాధీన రేఖ వెంబడి లడక్ పరిధిలోని  గాల్వన్ లోయలో మన భద్రతా దళాలకు చైనా సేనలకీ

మధ్య మంగళవారం చోటు చేసుకున్న ఘర్షణల్లో మన దళాల నుంచి ముగ్గురు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. దేశ సేవలో తరించిన ఈ వీరులకు తన తరపున, తమ పార్టీ తరపున బిగ్ సెల్యూట్ చేస్తున్నామన్నారు. వీరిలో తెలుగు బిడ్డ,  సూర్యాపేట కు చెందిన సంతోష్ బాబు ఉండడం చాలా

దురదృష్టం అన్నారు. తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వీరునికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. 

సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థి:

దేశ భక్తి మెండుగా ఉన్న సంతోష్ విజయనగరం జిల్లా  కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. అదే స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడు.

 

15 ఏళ్ళ పాటు ఆర్మీకి సేవలు చేసిన సంతోష్ కు ఇటీవలే పదోన్నతి సైతం లభించింది. హైదరాబాద్ కు బదిలీ అవ్వడంతో తిరిగి రావాల్సి యుంది. అయితే లాక్ డౌన్ కారణంగా లడక్ పరిధిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

ఇలాంటి వీరుణ్ణి ఈ భారతావని ఎన్నటికీ మరువదని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

కల్నల్ సంతోష్ గారి భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. అహరహం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్న మన సేనలకు దేశం అంతా మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. ‘మేమున్నాం....’ అని దేశమంతా అమరుల కుటుంబాలకు బాసటగా నిలవాలి. గాల్వన్ లోయ అమర వీరులకు బాధాతప్త హృదయంతో సెల్యూట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్

తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam