DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారానికోరోజూ రమ్మని ఆదేశం కాదు. .ఐచ్చికమే: విద్యా కమిషనర్

*పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం టీచర్ల నిస్వార్ధ కృషి* 

*ఆన్లైన్, టోల్ ఫ్రీ సేవలు అద్భుతంగా పనిచేస్తున్నాయి.*

*సందేహ నివృత్తి కై తల్లిదండ్రులు మాత్రమే రావచ్చు. .*

*DNS తో పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు వీరభద్రుడు వెల్లడి.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  17, 2020 (డిఎన్ఎస్):* వారానికో రోజు టీచర్లను రమ్మను ఎటువంటి ఆదేశాలు జారీ చెయ్యలేదని, స్వచ్చందంగా రావాలనుకుంటే నిస్వార్థ సేవలకు రావచ్చు అని సూచించినట్టు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా శాఖా కమిషనర్ వాడ్రేవు చిన్న వీరభద్రుడు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల

విద్యార్థుల భవిష్యత్ గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై DNS ఆయన్ను సంప్రదించింది. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రణాళికలను వివరించారు. వివరాలు అయన మాటల్లోనే. . . . 

కరోనా కష్ట కాలం లో పాఠశాలలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేనందున విద్యార్థుల బంగారు భవిషత్ ను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందనే

ఆలోచనతోనే రెండు రకాల ప్రణాళికలను రూపొందించినట్టు వీరభద్రుడు తెలిపారు. 

బ్రిడ్జి కోర్సు ( విద్యా వారధి )  పేరిట విద్యార్థులకు ఒక సులభతరమైన వర్క్ షీట్ లు సరిచూచుటకు, పత్రాలను తయారుచేసి వారికీ అందించడం జరిగిందన్నారు.  ప్రాథమిక స్థాయి తరగతుల నుంచి ఉన్నత పాఠశాల తరగతుల వరకూ దూరదర్శన్ వారి సౌజన్యంతో డిడి

సప్తగిరి ఛానెల్ లో వీడియో మాధ్యమం ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా నేర్చుకున్న పాఠ్యాంశాన్ని విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్న పత్రంలో సమాధానం వ్రాయాల్సియుంటుందన్నారు. వీరికి సందేహాలు కలిగితే నివృత్తి చేసుకునేందుకు ఒక రోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా

పాఠశాలలో నిస్వార్ధంగా ఐచ్చికంగా ( సొంతంగా) రావాలనుకునే వారు, విద్యార్థుల సందేహాలు పరిష్కరించాలనుకునే ఉపాధ్యాయులు వస్తే తమ పాఠశాలలకు హాజరు కావచ్చన్నారు. అయితే కనీస దూరం, మాస్క్ ధరించి, శానిటైజర్ రక్షణలోనే ఉండాలన్నారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికారిక ఆదేశాలు జారీ చెయ్యలేదని తెలిపారు. 

ఇది

విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకిత భావం, విద్యార్థుల భవిష్యత్ ను ద్రుష్టి లో ఉంచుకుని ఎందరో ఉపాధ్యాయులు తాము స్వయంగా పాఠశాలల్లో అందుబాటులో ఉంటామని, కోరిన మీదట, ఐచ్చికంగా చేశామన్నారు. 

అయితే విద్యార్థులు మాత్రం రాకూడదన్నారు. విద్యార్థులకు సందేహాలు ఉంటె ఫోన్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారాను

తెలుసుకోవచ్చన్నారు. ఫోన్ సదుపాయం లేని  విద్యార్థులు పాఠశాలకు వారి తల్లిదండ్రులను మాత్రమే పంపాలన్నారు. వీరికి ఉన్న సందేహాలను నివృత్తి చేసి, వారు పూర్తి చేసిన ప్రశ్నావళిని సరిచూసి వివరిస్తారన్నారు. 

వందలాది మంది ఉపాధ్యాయులు నిస్వార్ధంగా గత మూడు నెలలుగా ప్రజా సేవలో తరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి,

పోలీస్ యంత్రాంగానికి సంపూర్ణ సహకారాన్ని అందించి, ప్రజల్లో కరోనా మహమ్మారి పట్ల అవగాహనా కల్పించారన్నారు. వీరందినీ అయన అభినందించారు. ప్రస్తుతం తమ విద్యార్థుల భవిష్యత్ కోసం వారు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపి, ప్రస్తుత సమాజ నిర్మాణం లో ప్రధాన ఆభూమిక వహిస్తున్నారన్నారు. 

డిడి సప్తగిరి లో ప్రసార

వివరాలు ఇవే: 

జూన్ నెలలో తరగతులు ఏ విధంగా నిర్వహించాలి, ఏ తరగతి వారికీ ఏ పాఠం చెప్పాలి అనే వివరాలను ఈ నెలాఖరు వరకు ముందుగానే రూపొందించి, ఆయా పాఠ్యాంశాల ఉపాధ్యాయులు సవివరంగా తెలియచేస్తున్నారన్నారు. 

ప్రతి రోజు 1 , 2 తరగతుల వారికి : ఉదయం 11 గంటల నుంచి 11 :30 వరకు    

 3 ,4 ,5 తరగతుల వారికి : ఉదయం 11

గంటల నుంచి 11 :30 వరకు    
 
 6 , 7  తరగతుల వారికి : మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు    

 8 , 9 తరగతుల వారికి : మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు    

ఈ ప్రసారాలు జరుగుతున్నాయని వివరించారు. 

 ఉపాధ్యాయుల హాజరు ఐచ్ఛికమే... సేవాదృక్పథంతో ఉపాధ్యాయులు వ్యవహరించాలని 
చిన వీరభద్రుడు

సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam