DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ బాట లోనే తెలుగుదేశం కూడానా  ? ఆగస్టు నాటికి కీలక నేతలు జంప్ ?

విశాఖపట్నం, జులై 8 , 2018 (DNS Online) : కాంగ్రెస్ పార్టీ నడిచిన బాటలోనే తెలుగుదేశం పార్టీ కూడా నడవనుందా ? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలోనే

తెలుగుదేశం లోని ప్రముఖ ముఖాలన్నీ అయితే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా, జనసేన పార్టీలోకి మారిపోయే సూచనలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయం పై

సీనియర్ రాజకీయ వేత్త, అధికార పార్టీ ప్రతినిధి ఒకరు మీడియా కు లీక్ లు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా ఆగస్టు నెలాఖరు నాటికే పార్టీలో జంపింగ్ లు సంగతి

తేలిపోనుంది. తెలుగుదేశం పై రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన అవినీతి ఆరోపణలు, భూ కుంభకోణాలు, మంత్రులు, ఎం ఎల్ ఏ లు, ఎం పీల పై వెలుగు చూసిన పలు ఆరోపణలు పై ప్రజల్లో

పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం అభిమాన టీవీ చానెళ్లు, పత్రికలూ ఇతర పార్టీలపై విషం క్రక్కుతున్నాయి

అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 
దానిలో భాగంగానే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విషం కక్కడానికి గత నాలుగు

సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడం తో ఇప్పుడు 
పవన్ కళ్యాణ్ ను ప్రజల్లో తక్కువ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే ఆదివారం ఒక

మాజీ నటి తో ఇంటర్వ్యూను ప్రచురించినా  à°«à°²à°¿à°¤à°‚ లేకపోవడం తో టీవీ, పత్రిక అధినేత తల పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని సమర్ధవంతం à°—à°¾ ఎదుర్కొనేందుకు న్యాయ

పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. రానున్న కాలం లో ఈ ఛానెల్, పత్రిక చేసే ప్రచారం వల్లే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఊబిలోకి కూరుకు పోవడం కూడా జరిగే

అవకాశాలున్నాయని విశ్లేషకులు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam