DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రధయాత్రకు అనుమతి లేదు. . .సుప్రీం, ఏనుగులతో జరుపుతాం, పూరి రాజు

*ఈసారి పూరి రథ యాత్రలో పాల్గొనేది ఏనుగులు, సిబ్బందే. .?*

*రథయాత్ర లో భక్తులకు అనుమతి లేదు, ఏకాంతం లోనే :సుప్రీంకోర్టు* 

*రూల్స్ హిందువులకి మాత్రమే వర్తిస్తాయా?: హిందూ ధార్మిక సంఘాలు.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  18, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 23 న

జరుగనున్న విశ్వ ఖ్యాతి గాంచిన ఒడిషా  పూరికి జగన్నాధ్ రథయాత్ర లో ఈమారు భక్తులకు బదులుగా ఏనుగులు, సిబ్బంది పాల్గొనున్నట్టు తెలుస్తోంది. లక్షలాదిగా పాల్గొనే ఈ యాత్రలో  భాక్తులు పాల్గొనడం ద్వారా మహమ్మారి పెరిగే అవకాశం ఉందనే వాదనల ఆధారంగా ఈ యాత్రను బహిరంగంగా చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 23 న జరుగవలసిన

ఈ యాత్రకు ఇప్పడికే భారీ రథాలను సైతం 95 శాతం పూర్తి చేసేసారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పడికే దేశ వ్యాప్తంగా హిందూ దేవీ దేవాలయాలను పూర్తి గా మూసేసారు. తదుపరి అత్యంత కఠిన నిబంధనలతో ఆలయాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే లక్షలాదిగా భక్తులు పాల్గొనే పూరీ జగన్నాధ్ రధయాత్రలో కనీస దూరం పాటించడం

దాదాపుగా అసాధ్యమని నిర్ణయించి ఈ యాత్రను కేవలం ఏకాంతంలో నిర్వహించు కోవచ్చని, భక్తులు పాల్గొనరాదని ఆదేశించింది. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ దేశం లో రూల్స్, నిబంధనలు కేవలం హిందూ సమాజం వరకే అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాలు తెరిచినా తర్వాత కూడా రధ యాత్రలో భక్తులు పాల్గొనకుండా

నిషేధం ఏంటని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలె తప్ప, భక్తులను నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. 

 రథ యాత్రలో ఏనుగులు, సిబ్బంది. . .? . .

కోవిద్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది రథయాత్ర ను జరపరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు క్రమం లో భక్తులకు మారుగా ఏనుగులు పాల్గొనున్నాయి. జగన్నాధుని

రధసేవలో భక్తులు పాల్గొనడం ద్వారా ఆందోళన పెరుగుతుందనే వాదనల ఆధారంగా ఈ ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. 

గత 284 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఒడిషా జగన్నాథ రధయాత్ర లో ఈ ఏడాది ఏకాంతం లో జరుపుకోవాలని పూరి రాజు దిబ్యసింగా దేబ్ తో నిర్ణయించారు. దీంతో కేవలం రధాన్ని ఏనుగులతో మరియు సేవకులతో పరిమితంగా

జరపాలని పూరి రాజు సహా, సహా ఆలయ అధికారులు, పూజారులు మరియు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.

భక్తులు పాల్గొకుంటే అరిష్టం : పూరీ వాసులు . . .

పూరి రథయాత్రలో భక్తులు పాల్గొకుండా అరిష్టమని, పూరి ప్రజలు విశ్వసిస్తుంటారు. గత మూడు శతాబ్దాల కాలంలో ఇలాంటి సందర్బంగా లేదన్నారు. అంతకు ముందు కాలంలో జరిగిన

దుష్ఠ్యంతాలు ఉన్నట్టు భక్తులు తెలియచేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇది అరిష్టంగా...దేశానికి అశుభంగా బావిస్తున్నారు.

కేవలం హిందువులకే నిబంధనలా: ధార్మిక సంఘాలు 

ఈ దేశంలో కేవలం నిబంధనలు, చట్టాలు హిందూ సమాజం కోసమే పనిచేస్తుంటాయని, హిందూ ధార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా

జరుపుకునే అత్యంత భారీ ఉత్సవం పూరి జగన్నాధ్ రధోత్సవం అని, దీనిలో పాల్గొనేందుకు దేశ , విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హరజతవుతాని తెలియచేస్తున్నాయి. కరోనా వ్యాప్తి తో లాక్ డౌన్ పేరిట సుమారు 85 రోజులు ఆలయాలన్నీ మూసేశారని, ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తేసిన హిందూ ఆలయాలపై అధికారులు, పెత్తనం మాత్రం చేస్తున్నారన్నారు.

పాల్గొనే  భక్తులు కనీస దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలె తప్ప, మొత్తం గా భక్తులు పాల్గొనకూడదంటూ ఆదేశాలు జారీ చెయ్యడం ఏంటని మండిపడుతున్నాయి. 

అదే గత నెల్లో జరిగిన రంజాన్ దీక్షలా కోసం నెల రోజుల పాటు వెసులు బాటు కల్పించిన విషయాన్నీ ధార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam