DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భరతమాత ముద్దుబిడ్డలు, అమరవీరులకు వందనం: మాజీ ఎంపీ

*సతీష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం*

*వీరులకు ఆత్మశాంతి కలగాలి: మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  18, 2020 (డిఎన్ఎస్):* దేశ రక్షణ లో ప్రాణాలని సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేస్తూ అమరులైన భరతమాత ముద్దుబిడ్డలు వీర

సైనికులందరికీ  మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఘననివాళి అర్పించారు. వీరందరికీ ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. చైనా ముష్కరుల దొంగదాడి కి బలైన తెలుగు బిడ్డ సతీష్ బాబు కుటుంబానికి మానసిక స్థైర్యాన్ని లభించాలని కోరుకున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఘటనల్లో అమరులైన భారతీయ వీర

సైనికులందరి పోరాటపటిమ దేశప్రజలందరికీ స్ఫూర్తి కావాలని  భీమవరం కు చెందిన తెలుగుదేశం మాజీ రాజ్య సభ సభ్యులు పిలుపునిచ్చారు. 

సంతోష్ బాబు విజయనగరం సైనిక స్కూల్ పూర్వ విద్యార్థి కావడం మన అందరికి గర్వకారణం అన్నారు. దేశం కోసం చైనా సైనికులతో సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారు. సంతోష్ బాబును ఈ నేల ఎప్పటికీ

మరువదన్నారు.  తెలుగుదేశం పార్టీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం అని, దేశ క్షేమాన్ని ఎప్పుడూ కోరుకుంటుందని తెలిపారు. 
గతంలోనూ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు పార్టీ  అండగా నిలబడిందని, ఇప్పుడు సంతోష్ బాబు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు  మంచిర్యాల

జిల్లాలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ లో (1993-2000)చదివారని,  2004లో ఆర్మీలో చేరారు. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. గోల్డ్ మెడల్స్ సాధించి తక్కువ సమయంలోనే లెఫ్ట్ నెంట్ కల్నల్ గా పదోన్నతి పొందారు. 
సంతోష్ బాబుకు ఈ మార్చిలో

హైదరాబాద్ కు బదిలీ అయినప్పటికీ కరోనా కారణంగా అది ఆగిపోయింది. ఇంతలో సరిహద్దుల్లో  చైనాతో పోరాడుతూ సంతోష్ బాబు  వీరమరణం చెందడం దురదృష్టమన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam