DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వీయరక్షణ తప్పనిసరి, వైద్యులకు కలెక్టర్ సూచన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 18, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు స్వీయ రక్షణ పాటిస్తూ కరోనా రోగులను పరీక్షించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రైవేటు వైద్యులకు సూచించారు. గురువారం సాయంత్రం కరోనా నివారణ చర్యలపై స్థానిక జిల్లా పరిషత్

సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న రోజుల్లో కరోనా మరింత వ్యాప్తిచెందే అవకాశం ఉందని, కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వారి వివరాలు తక్షణమే తమకు తెలియజేయాలని ఆదేశించారు. రోగి వివరాలు అందించడం ద్వారా కరోనా

వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేసారు. కరోనా రోగుల విషయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించరాదని, స్వీయరక్షణ తప్పనిసరిగా పాటిస్తూ రోగిని పరీక్షించాలని హితవు పలికారు. వైద్యులు పి.పి.ఇ కిట్లను వినియోగించకుండా రోగులను పరీక్షించడం వలన రోగితో పాటు వైద్యునికి, తద్వారా ఇతరులకు

వ్యాప్తిచెందే అవకాశం ఉందన్న సంగతిని వైద్యులు గుర్తెరగాలని తెలిపారు. జిల్లాలో ట్రూనాట్ కిట్లకు కొరత లేదని, జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు  1500 మంది వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక జిల్లా శ్రీకాకుళం  అని జిల్లా కలెక్టర్ చెప్పారు. వలసలు వెళ్లినవారు తిరిగి జిల్లాకు విచ్చేస్తున్నారని, వారిలో

కొంతమంది కరోనా లక్షణాలతో ఉంటే, మరికొందరు లక్షణాలు గుర్తించక వస్తున్నవారు ఎక్కువగా ఉన్నారని, వీరిని దృష్టిలో ఉంచుకొని అనుమానస్పదంగా ఉన్న ప్రతీ ఒక్కరిని నిశితంగా వైద్యులు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. రోగులకు పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు.  ఆసుపత్రులకు

వచ్చిన రోగుల వివరాలు తప్పనిసరిగా రిజిష్టరులో నమోదుచేయాలని, లక్షణాలు కనిపిస్తే తక్షణమే కంట్రోల్ రూమ్ కు వివరాలు అందించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలను 94405 12447 వాట్సాప్ నెంబరుకు సమాచారాన్ని అందించడం లేదా కాల్ చేసి తెలియజేయాలని సూచించారు. ఈ విధమైన సమాచారాన్ని అందించడం ద్వారా కరోనా వ్యాప్తి

చెందకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా  జిల్లాలో ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను ఆ యాప్ నందు అప్ లోడ్ చేయాలని సూచించారు.  యాప్ లోని సాంకేతికపరమైన సమస్యలు లేదా సందేహాలు ఉన్న కిశోర్ - 98856

96486 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. అలాగే ప్రతీ వైద్యుడు ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, దానిని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా నివారణకు సహకరించారని, ఇదేస్పూర్తితో ఇకముందు కూడా జిల్లాలో కరోనా

వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ప్రైవేటు ఆసుపత్రులు తోడ్పాటునందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా వైద్యులను కోరారు. 
    ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య,  డా. కింజరాపు అమ్మన్నాయుడు , డా. దానేటి శ్రీధర్, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam