DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి జల విహార కంట్రోల్ రూమ్ శిలాఫలకం ప్రారంభం 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరం లోని గోదావరి గట్టు పద్మావతి ఘాట్ వద్ద పర్యాటక శాఖ జల విహార నియంత్రణ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు అమరావతి నుండి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన

సందర్భంలో ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాన్ని జల విహార నియంత్రణ కేంద్రం ఆవరణలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ నదీతీర ప్రాంతాలు,  సముద్రతీర ప్రాంతాల్లో జల విహార యాత్రలో ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదానికి

ప్రమాదానికి గురి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జలవిహార్ నియంత్రణ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారని అన్నారు. కంట్రోల్ రూముల్లో ప్రయాణికుల పూర్తి సమాచారంతో పాటు జిపిఎస్ పద్ధతిని ద్వారా రక్షణ చర్యలు చేపడతారు అన్నారు. ప్రతి ఒక్కరూ స్వయం రక్షణ చర్యలు తీసు కోవాలని, విహార యాత్రకు వెళ్లే

వారు ఈ కంట్రోల్ రూమ్ లో పూర్తి సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషి క్త్ కిషోర్, ఆకుల వీర్రాజు, కే సత్య, పిల్లి నిర్మల, మార్గాన్ని సురేష్, మజ్జి అప్పారావు, తదితర స్థానిక నాయకులు, ఎంపీ తో ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam