DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో జగన్నాధ స్వామి వార్షిక రథయాత్ర రద్దు .: ఈవో శిరీష

*గుడిలోనే ప్రదక్షిణ యాత్ర, భక్తుల అనుమతి లేదు* 

*ఆధార్ తప్పనిసరి, రెడ్, కంటైన్ మెంట్ జోన్ ల్లోని వారు రావద్దు.*

*దర్శనానికి మాత్రమే భక్తులకు  అనుమతి: ఈవో శిరీష* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి విజృంభిస్తున్న

తరుణంలో ఈ నెల  23 న జరుగవలసిన జగన్నాధ రథయాత్రను రద్దు చేసినట్టు విశాఖపట్నం లోని వన్ టౌన్ జగన్నాధ స్వామి ఆలయ కార్య నిర్వహణాధికారి కే. శిరీష తెలియచేసారు. ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలను శుక్రవారం ఆమె ప్రకటించారు. 

కరోనా మహమ్మారి కారణంగా రథయాత్రను కేవలం ఏకాంతంలోనే జరుపుతామని, ఆలయ ప్రాంగణంలోనే

నిర్వహించనున్నట్టు తెలిపారు. కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మాత్రమే పాల్గొంటారన్నారు. భక్తులకు అనుమతి లేదని తెలిపారు. కేవలం భక్తులకు స్వామి దర్శనం మాత్రం అనుమతిస్తామన్నారు. ప్రతి భక్తుడు తమ వెంట ఆధార్ కార్డు ను తప్పకుండా తీసుకురావాలని, ఫోన్ నెంబర్ ను సిబ్బందికి తెలియచేయాలన్నారు. భక్తులు విధిగా ముఖానికి మాస్క్

ధరించాలని,  కనీస దూరం పాటించాలన్నారు. 


రెడ్ జోన్, కంటైన్ మెంట్ జోన్ వారు రావద్దు:

నగర పరిధిలో ఉన్న రెడ్ జోన్, కంటైన్ మెంట్ జోన్ ల్లో ఉండే భక్తులు ఈ ఏడాది ఆలయానికి రావద్దని మనవి చేసారు. 

20 నుంచి ఉత్సవాలు ఆరంభం:. . .

ఈ నెల 20 నుంచి జులై 4 వరకూ 15 రోజుల పాటు జగన్నాధ స్వామి ఉత్సవాలను

వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. ఈ నెల 20  (శనివారం)  న ప్రతిష్ఠా జరుగుతుందని, 21 ఆదివారం రోజున జలాధివాసం, క్షీరాధివాసం, పంచశయ్యని వాసం జరుగుతాయని వివరించారు. 22 న ఉదయం 11 :30 గంటలకు స్వామి వారి నేత్రోత్సవం, సాయంత్రం 6 గంటల నుంచి  స్వామి వారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. 

23 న

ఏకాంతంలోనే స్వామి వారి శోభాయాత్ర జరుగుతుందన్నారు. భక్తులకు ప్రవేశం లేదన్నారు. 
 
24 నుంచి జులై 3 వరకూ ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం 6 :30 గంటల వరకు మాత్రమే దర్శనం లభిస్తుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam