DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీజనల్ వ్యాధుల పై దృష్టి పెట్టాలి: మునిసిపల్ కమిషనర్ అభిషిక్త్

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):*  వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆఫీసర్  లు, మెడికల్ టీములతో తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్

కమిషనర్ అభిషి క్త్  కిషోర్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో వర్షాకాలం దాని ప్రభావం వల్ల మలేరియా, పైలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన

కల్పించాలన్నారు. స్లమ్ ఏరియాలోదోమల మందు పిచికారి చేయించాలని,  మరుగుదొడ్లు పైపులకు దోమల గుడ్ల నివారణ వలలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని, కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆస్పత్రులులో మందులు సిద్ధంగా ఉంచాలని ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు పరచాలి ని కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా

ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, జిల్లా ఉప వైద్యశాఖాధికారి  డాక్టర్ కోమల, కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విన్నూత్న, తదితరులు ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam