DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 న సూర్యగ్రహణం, టిటిడి ఆలయాలు మూసివేత

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  20, 2020 (డిఎన్ఎస్):* చూడామణి సూర్య‌గ్రహణం కారణంగా ఈ నెల 21 ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆలయాలన్నీ మూసివేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. టిటిడికి అనుబంధంగా ఉన్నతిరుపతిలోని శ్రీ ‌గోవిందరాజ‌స్వామివారి ఆల‌యం, ‌శ్రీ

కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, ‌ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ‌నివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో  జూన్ 21వ తేదీ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆల‌య త‌లుపులు మూసి ఉంచుతారు. జూన్ 21న

ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా జూన్ 20వ తేదీ రాత్రి ఏకాంత సేవ త‌రువాత ఆల‌య తలుపులు మూసివేస్తారు. తిరిగి జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య తలుపులు తెరుస్తారు.

తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ

గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో జూన్ 21 మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆలయం తలుపులు తెరుస్తారు. మ‌ధ్యాహ్నం 3.00 నుండి రాత్రి 7.00 గంట‌ల వ‌ర‌కు ఆల‌యశుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, సుప్ర‌భాతం, తోమాల‌సేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, మొద‌టి గంట‌, సాత్తుమొర‌, రెండో గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. రాత్రి 7.00 గంటలకు ఏకాంత సేవ

నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

తిరుపతిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌‌స్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌‌స్వామివారి ఆలయంలో జూన్ 21 మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు ఆలయం తలుపులు తెరుస్తారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం,

సుప్ర‌భాతం, అభిషేకం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, మొద‌టి గంట‌, రెండో గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ

కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 21 మ‌ధ్యాహ్నం 3.45 గంట‌ల‌కు ఆలయం తలుపులు తెరుస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యశుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల‌సేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, మొద‌టి గంట‌, రెండో గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం

ఉంటుంది. రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు రాత్రి తోమాల‌సేవ‌, రాత్రి గంట అనంత‌రం ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు శుద్ధి,

పుణ్య‌హ‌వ‌చ‌నం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వ‌రకు సుప్ర‌భాతం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న చేప‌డ‌తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌రకు శుద్ధి, మొద‌టి గంట‌, రెండో గంట‌, రాత్రి గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. రాత్రి 7.30 గంట‌లకు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ

రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మ‌ధ్యాహ్నం 2.30  గంటలకు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, ఇత‌ర కైంక‌ర్యాల ఆనంత‌రం

మ‌ధ్యాహ్నం 4.30 గంట‌ల నుండి 6 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మ‌ధ్యాహ్నం 2.30  గంటలకు ఆల‌య త‌లుపులు

తెరుస్తారు. శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, ఇత‌ర కైంక‌ర్యాల ఆనంత‌రం రాత్రి గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam