DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ కట్టడికి కఠినంగా వ్యవహరించండి: మంత్రి ధర్మాన

*శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ నివాస్ కు మంత్రి సూచన . . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 20, 2020 (డిఎన్ఎస్):* కరోనా కేసుల సంఖ్య జిల్లాలో గత వారం రోజులుగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు, అధికార యంత్రాంగం  మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్

చెప్పారు.  అమరావతి నుంచి ఆయన జిల్లా కలెక్టర్ జె.నివాస్ తో శనివారం మధ్యాహ్నం ఫోన్ లో మాట్లాడారు. జిల్లాలో కోవిడ్ తాజా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఆంక్షలు కఠినతరం చేసైనా వ్యాధి వ్యాప్తిని నిరోధించాలని సూచించారు. మందసలో కరోనా కారణంగా ఒకరు మృతి చెందడం బాధాకరమని, రాష్ట్రం మొత్తం కోవిడ్

వ్యాప్తి చెందినా, మనం ఒక్క కేసు నమోదు కాని దశనుంచి దాదాపు 500 కేసులకు దగ్గరకు రావడం దురదృష్టకరమని అన్నారు. అధికార యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నా, ముందు ముందు వలస కార్మికులు మరింత మంది జిల్లాకు చేరే అవకాశం ఉందని, ఇక నుంచి యంత్రాంగంపై మరింత బాధ్యత పెరగనుందని అన్నారు. కంటోన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతున్న

దృష్ట్యా అక్కడ ఉన్న వారందరికీ రేషన్, ఇతర నిత్యావసర సరుకులు, పండ్లు కూరగాయలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా ఉండాలని సూచించారు. అవసరమైతే జిల్లాలో మరోసారి ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో తొలిసారి సర్వే పూర్తయిందని, మరోసారి సర్వేలో ఇంకా

నాలుగు లక్షల ఇళ్ళు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కేసులు నమోదవుతున్న క్వారంటైన్ కేంద్రాల చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆయా చోట్ల పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రభుత్వం సూచించిన పౌష్టికాహారాన్ని ఏ పరిస్థితుల్లోనూ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అందజేయాలని మంత్రి ఆదేశించారు.

జిల్లా ప్రజలు సైతం మరింత సామాజిక బాధ్యతతో ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటించి కోవిడ్ నిరోధానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రి కృష్ణ దాస్ పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam