DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోజిటివ్ కేసులు పెరిగితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్  

*జిల్లాలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.* 

*ప్రజల నిర్లక్ష్య ధోరణి పై కలెక్టర్ నివాస్ సీరియస్*  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 20, 2020 (డిఎన్ఎస్):* జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభం అయ్యిందని, కరోనా పోజిటివ్ కేసులు పెరిగితే శ్రీకాకుళం

జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలియచేస్తున్నారు. శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమం లోనే జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ సైతం కలెక్టర్ కు బాసట గా నిలిచి, కరోనా వ్యాప్తి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

 శనివారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బూర్జ, మందస కేసులను పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ప్రారంభం అయినట్లు స్పష్టం అవుతుందన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతోంది. ప్రస్తుతం 417 కేసులు ఉండగా 126 డిశ్చార్జి అయ్యారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

రానున్న రెండు నెలలు కీలకం: .

.. 

గతంలో లాక్ డౌన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని, లాక్ డౌన్ సడలింపు తరువాత చాలా మంది పూర్తిగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. మాస్కులు ధరించడం లేదు. మాస్కులు ధరించని వారికి ఫైన్ వేస్తున్నాం అని, మాస్కులు ధరించకుండా కరోనా వైరస్ రిస్క్ తీసుకుంటున్నవారిని

క్వారంటీన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్ లలో సేవలు  చేసే విభాగంలో పెడతాం అని హెచ్చరించారు. 

అప్రమత్తంగా ఉండని మీరు మీతోపాటు మీ కుటుంబాన్ని ప్రమాదంలో పెడుతున్నారని, మాస్కులు ధరించకుండా వచ్చే వారికి సరుకులు విక్రయించవద్దని దుకాణాలను హెచ్చరించాం అన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్న కేసులు

వస్తున్నాయని, ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశం నిర్వహించి కేసుల సమాచారం అందించాలని ఆదేశించారు. సమాచారం అందించని ఆస్పత్రులపై  చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ క్రమం లోనే  నరసన్నపేటలో ఒక ఆసుపత్రికి షో కాజ్ నోటీసు జారీ చేశామని, సరైన సమయంలో వైద్య పరీక్షలకు వస్తే ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. 

జ్వరం,

దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే సమీపంలోని సిహెచ్సికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

జిల్లాలో పలాస, టెక్కలి, మందస, ఎల్.ఎన్. పేట,బైరి, లోలుగు, శ్రీకాకుళంలో కంటైన్మెంట్ జోన్లు  ఉన్నాయని, పలాస, రాజాంలలో స్వచ్చందంగా లాక్ డౌన్ కు ముందుకు వచ్చారు అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam