DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యాదవుల అభ్యున్నతికి కృషి చేస్తా: రవి యాదవ్

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  20, 2020 (డిఎన్ఎస్):* రాజకీయాలకు అతీతంగా యాదవుల సంక్షేమానికి అభివృద్ధికి కృషిచేస్తానని గ్రేటర్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరుకుర్తి రవియాదవ్ తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని దానవాయిపేట శ్రీకృష్ణ

యాదవ భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లలకు వారసత్వ పు హక్కు కల్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన రెడ్డి  చిత్రపటానికి నగర  శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు, తొలుత రవియాదవ్ పాల్గొని పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైనా దురాగతంలో అసువులు బాసిన

భారత అమర సైనికులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఇటీవల నగరానికి చెందిన దాసరి వీర్రాజు యాదవ్ కు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు. అనంతరం గ్రేటర్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు రవియాదవ్, ప్రధాన కార్యదర్శి పడాల నాగరాజు ఎన్నికపై అభినందనసభ జరిగింది. నాగరాజు

అద్యక్షతన జరిగిన సభలో రవియాదవ్ మాట్లాడుతూ సంఘ సభ్యుల్లో వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని సంఘ అబివృద్దికి, సభ్యుల సంక్షేమానికి పాటుపడతామన్నారు, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, కోరతామన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఈ జిల్లా

వ్యక్తికే కేటాయించేలా విజ్ఞప్తి చేస్తానని అన్నారు. కమిటీ ని  విస్తరించి త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంకం గోపి, నక్కెళ్ల బాబురావు, ప్రసాదుల హరినాధ్, జి టి పి కుమార్, పడగల ప్రసాద్,  నొడగల సుధా యాదవ్ మరుకుర్తి దుర్గయదవ్, మందపాటి సత్యనారాయణ,

మిస్కా జోగినాయుడు, మొల్ల చిన్నియాదవ్, తుళ్ళి పద్మావతి, జానా బుజ్జి,  మరుకుర్తి కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam