DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైయస్సార్ నేతన్న నేస్తం రెండో విడత సాయం పంపిణీ

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  20, 2020 (డిఎన్ఎస్):* నేత కార్మిక వర్గాలకు అండగా నిలబడుతున్న తరుణంలో  రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ నేతన్న నేస్తం రెండో విడత ఆర్థిక సహాయ  పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శనివారం నాడు ముఖ్యమంత్రి  వీడియో

కాన్ఫరెన్స్ నిర్వహించి, చేనేత కార్మికులకు రూ.200 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ ని ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.
    ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈరోజు మొత్తం రూ.400  కోట్ల పైన నిధులు చేనేత రంగానికి ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
   ఇందులో రూ.200 కోట్లు చేనేత కార్మికులకు రెండో విడత ఆర్థిక సహాయానికి, రూ.103 కోట్లు ఆప్కో

సంస్థకు గత ప్రభుత్వ హయాంలో చెల్లించవలసిన బకాయిల నిమిత్తం, రూ.109 కోట్లు మాస్కు లను తయారుచేయడానికి అవసరమైన బట్టను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్న ట్లు తెలిపారు.
   సొంత మగ్గం కలిగి ఉన్న చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక సహాయం చేయడానికి వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించామన్నారు.
 

 కరోనా వలన పని లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికుల ను ఆదుకోవడానికి రెండో విడత ఆర్థిక సహాయాన్ని రానున్న డిసెంబర్ నెలలో ఇవ్వడానికి బదులుగా ఆరు నెలల ముందే ఈరోజు ఇస్తున్నట్లు తెలిపారు.
  చేనేత కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో "ఈ మార్కెటింగ్" ప్లాట్ ఫామ్ ను

నెలకొల్పనున్నట్టు తెలిపారు.
   విశాఖపట్నం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసు, శాసనసభ్యులు గొల్ల బాబురావు, ఏ. అదీప్ రాజు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ - 3 గోవిందరావు, చేనేత జౌళి శాఖ ఆర్జెడి ధనుంజయ రావు,

డెవలప్ మెంట్ అధికారులు సునీల్ కుమార్, రమణమ్మ పాల్గొన్నారు.
  ఇంకా లబ్ది పొందిన చేనేత కార్మికులు పలివెల అప్పలనర్సయ్య,    శ్రీమతి అల్లంక బ్రమరాంబ, శ్రీమతి ఉప్పు శేష కుమారి, తూట రామాంజనేయకుమార్, అల్లాడ అప్పల సూర్య రావు పాల్గొన్నారు. 
  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వి. వినయ్ చంద్ చేనేత

కార్మికులకు  రూ.62, 16, 000 ల నిధులను చెక్ రూపంలో అందించారు.
   విశాఖ పట్నం జిల్లా లో  వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను 259 మంది లబ్ధిదారులకు రూ.62, 16, 000 లను రెండో విడత ఆర్థిక సహాయం కింద వారి బ్యాంక్ అకౌంట్ లలో జమ చేయబడుతుంది.
   పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంలో 179 మంది లబ్ధిదారులు,

నర్సీపట్నం నియోజకవర్గంలో 43 మంది లబ్ధిదారులు, ఎలమంచిలి లో 2, మాడుగుల లో 1, గాజువాకలో 1, విశాఖపట్నం పడమర లో 1, భీమిలిలో 5 గురు, అనకా పల్లి లో 20 మంది, చోడవరంలో 7 గురు చేనేత కార్మికులు లబ్ధి పొందుతారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam