DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు, అంతా పాస్: మంత్రి సురేష్

*ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. . .*

*పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానం అన్న సీఎం జగన్* 

*రద్దు ప్రకటించే సమయంలో ఉద్వేగానికి లోనైనా మంత్రి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  20, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో

విద్యార్థుల పరీక్షల కంటే వారి ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి వార్షిక , ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ  పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విజయవాడ లో శనివారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసారు.  జులై 10 నుంచి మొదలు కావాల్సిన పదవ తరగతి వార్షిక పరీక్షలు, 11 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి, అందరు విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా వారు కూడా పాస్ గానే గుర్తిస్తామన్నారు.  

 

ఎన్నో పర్యాయాలు వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశాల అనంతరం గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కీలక సమావేశం నిర్వహించామన్నారు. 
గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ పరీక్షల పై సమీక్ష సమావేశంలో ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది

పడకూడదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని మంత్రి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భవితలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను అన్ని పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఆ సమావేశం తీర్మానించిందన్నారు. 

ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదు: సీఎం.. 

కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ

తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆదేశించడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.  జూన్ 15 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పరీక్ష లపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపధ్యాయ సంఘాలు, అధికారులతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిపారు. 

తప్పనిసరిగా

పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం అని, దానికి అనుగుణంగానే పరీక్ష విధానంలో మార్పులు చేసాం.. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం. అయితే విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా విద్యార్థుల  పదో తరగతి, ఇంటర్

పరీక్షలు రద్దు చేస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం.

ఈ పరీక్షల రద్దు ప్రకటన సమాచారం తెలియచేసే సమయంలో మంత్రి సురేష్ చాలా ఉద్వేగానికి లోనవ్వడం అయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. అత్యంత కీలక మైన ప్రకటన కావడం తో ప్రశాంత వాతావరణంలో సైతం ఆయనకు చెమట్లు

పట్టడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam