DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సూర్య గ్రహణం ప్రభావం, ఆలయాలు మూసివేత

*సింహాచలం, అరసవల్లి, తదితర ఆలయాలు మూసివేత* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  20, 2020 (డిఎన్ఎస్):* చూడామణి సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని దేవాలయాలను శనివారం రాత్రి ఆరాధన అనంతరం మూసి వేశారు. తిరిగి ఆదివారం గ్రహణానంతరం పుణ్యాహవచనం కావించి భక్తులకు

దర్శనాన్ని కల్పించనున్నారు. 
ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం ఆలయంలో శనివారం ఆరాధనలు అనంతరం ఆలయాన్ని మూసివేశారు. తిరిగి ఆదివారం ప్రోక్షణ అనంతరం తెరిచి, ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్గించనున్నారు. 
శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి శ్రీ

సూర్యనారాయణ స్వామి దేవాలయం శనివారం రాత్రి ఆరాధనలు అనంతరం మూసివేశారు. ఆలయ అర్చకులు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రహణ కాలంలో ప్రత్యేక జపతపాదులు ఏకాంతంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. 
విశాఖపట్నం లోని బురుజు పేటలో గల శ్రీ కానక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించిన

అనంతరం రాత్రి 7 గంటల తదుపరి మూసి వేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి తెలియచేసారు. ఆదివారం పుణ్యాహవచనం శుద్ధి అనంతరం అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు ఉంటాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam