DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులకు, సిబ్బంది కి కరోనా. . మూతపడుతున్న ఆలయాలు

*ఆలయాలు అంత అర్జెంటు గా తెరవాల్సిన అవసరం ఏంటి?*

*ఆలయాలు తెరిచారు. . తేడా వస్తే మూసేస్తున్నారు. .*

*హుండీ ఆదాయం నష్టమా, ప్రభుత్వ పెట్టుబడికి గండి పడిందనా?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* కరోనా విజృంభిస్తున్న తరుణంలో హిందూ దేవీ

దేవతలా ఆలయాలు అంత అర్జెంటు గా తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. గత 80 రోజులుగా మూతపడిన ఆలయాలు ఈనెల 8 న తిరిగి తెరవడంతో భక్తులు ఆలయాలకు రావడం మొదలు పెట్టారు. అంతే . , ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంటూ ప్రగల్బాలు పలికిన టిటిడి లాంటి పెద్ద సంస్థల పరిధిలోని ఆలయాల్లోని సిబ్బంది పై సైతం

కరోనా పిశాచి తన ప్రభావాన్ని చూపడం ఆ ఆలయాలను వెంటనే మూసివెయ్యాల్సిన అవసరం వచ్చింది. మొన్న గోవిందా రాజస్వామి ( తిరుపతి) ఆలయం లో ఒక సహాయక సిబ్బంది కి కరోనా సోకగా, నిన్న అహోబిల నృసింహ క్షేత్రం లోని  ఏకంగా అర్చకునికే సోకడంతో ఈ క్షేత్రం కూడా మూసివేయడం జరిగింది. 
ఎన్ని జాగ్రత్తలు తీసున్నామని ప్రకటించినా అధికారులు,

సిబ్బంది, భక్తులు, ఎవరు తేడాగా ఉన్నా మొత్తం ఆలయాన్ని మూసివెయ్యాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆలయాలను అర్జెంటు గా తెరవాల్సిన అగత్యం ఏమి వచ్చిందో వాళ్ళకే తెలియాలి. ఆలయాల్లోని హుండీ ఆదాయం తగ్గిపోయి ప్రభుత్వం చేస్తున్న వ్యాపారంలో కోట్లాది రూపాయల

నష్టం వచ్చిందేమో వాళ్ళకే తెలియాలి. 

హుండీ లో ఎంత పడుతుందో ఎలా తెలుసు?

ఆలయంలోని హుండీ లో ఎంత మొత్తంలో మొక్కుబడులు భక్తులు వేస్తారో ఆలయ అధికారులు, ప్రభుత్వం ఎలా అంచనా వేసుకుంటారు? గత 80 రోజుల్లో ఒక్క హుండీ లోనూ ఒక్క పైసా పడలేదు. ఆలయంలో ఉంది లో పడే ప్రతి రూపాయి భక్తుల ఇష్ట ప్రకారం ఎంత తోస్తే అంతే

పడుతుంది. ప్రతి భక్తుడు కచ్చితంగా ఇన్ని రూపాయలు హుండీ లో వెయ్యాలి అనే రూల్స్ ఎక్కడా లేవు. కాబట్టి హుండీ ఆదాయం ఎంత ఉంటుందో ఎవ్వరూ చెప్పడం  కష్ఠం.  

ఆలయాలు వ్యాపార కేంద్రాలు కాదు. ..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ హిందూ దేవాలయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. పైగా ఈ

ఆలయం పై వచ్చే ఆదాయం మీద మాత్రం పెత్తనం చేస్తుంది. దేవాదాయ శాఖా ఆలయాలకు వ్యాపార కేంద్రాలుగానే చూస్తాయి తప్ప, ఆధ్యాత్మిక భావన ఏ కోసం లేదు. హుండీ లో పడే ప్రతి పైసా తన ఖజానా నుంచే ఇచ్చినట్టు పెద్ద బిల్డప్ మాత్రం ఇచ్చి, ప్రతి ఒక్కడూ అజమాయిషీ మాత్రం చేస్తాడు. పైగా ప్రతి ఆలయం ఇంత ఆదాయం దేవాదాయ శాఖా బ్యాంకు ఖాతాకు జమ

చెయ్యాలి అనే నిబంధనలు బలవంతంగా అమలు చేస్తుంది. అసలు ఆదాయమే రాని ఆలయాలను మాత్రం ఏమాత్రం పట్టించుకుని తీరిక మాత్రం దీని దగ్గర ఉండదు. 

తెరిచారు. . మళ్ళీ మూసేస్తున్నారు. .. 

అయితే ఆలయాలు తెరిచే నాటికి కరోనా పిశాచి మరింత విజృంభిస్తూ స్వైర విహారం చేస్తోంది. ఈ క్రమం లో ఆలయాలు తెరవడంతో ఒక్కసారిగా

భక్తులు ఆలయాలకు క్యూలు కట్టారు. అంతే. . .మళ్ళీ మహమ్మారి పెరగడం మొదలెట్టేసింది. దీంతో ఇన్నాళ్లు ఆలయాల్లో ఏకాంతంలో అర్చనలు చేసుకున్న అర్చకులకు ఏమాత్రం కరోనా ప్రభావం కనపడలేదు. ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇవ్వగానే అర్చకులకు అంటుకోవడం మొదలైంది. దీంతో మళ్ళీ ఆలయాలు మూతపడే పరిస్థితికి వచ్చేసాయి. 

తెరవడం అందుకు

మళ్ళీ ఆలయాలు మొయ్యడం ఎందుకు? ఆరాధనలు ఏకాంతంలో యధావిధిగానే సాగుతుంటాయి.  అర్జెంటు గా ఆలయాలు తెరిచి వీళ్ళు ఉద్దరించేది ఏంటి? 

ప్రత్యేక దర్శన టికెట్లు, ఇతర క్రయ విక్రయాలకు టికెట్ల వసూళ్లు కోల్పోతామని భావించి, ఆలయాలు అర్జెంటు గా తెరిచేసారు. అయితే ఆలయానికి వెళ్లే సిబ్బంది, భక్తులకు దినదిన గండం నూరేళ్లు

ఆయుష్ గానే ఉంది పరిస్థితి. 
అయితే 10 ఏళ్ళ వయసు లోపు చిన్నారులను, 60 ఏళ్ళు దాటిన వృద్ధులను, ఆలయానికి రానివ్వక్కపోవడం ఒక శుభపరిణామం గా అందరూ భావిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam