DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న పూరి రథయాత్ర కు తొలగిన అడ్డంకులు, జాగ్రత్త పాటించాలి

**రథయాత్ర లో భక్తులు వద్దు, టీవీ లైవ్ తప్పని సరి : సుప్రీం సవరణ.**

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీంకోర్ట్ ఒకే చెప్పింది. అయితే ఈ రథయాత్రలో భక్తులు లేకుండా నిర్వహించాలని, భక్తులకోసం రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని

సుప్రీంకోర్ట్ ఆదేశించింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేస్తూ జూన్‌ 18న ఇచ్చిన తీర్పును సవరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. భక్తుల ప్రమేయం లేకుండా యాత్రను చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ కు అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.

కాగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 భక్తుల లేకుండా పూరీ రథ యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం సోమవారంనాడు తెలిపింది. ఈనెల 23న జరగాల్సిన చారిత్రక జగన్నాథ రథయాత్రపై

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ డజనుకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సీజేఐ ఎస్ఏ బాబ్డేతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ చేపడుతోంది.
కోరనా మహమ్మారి నేపథ్యంలో పూరీ సహా ఒడిసాలోని అన్ని ప్రాంతాల్లో రథయాత్రల నిర్వహణపై అత్యున్నత న్యాయస్థానం ఈనెల 18న స్టే ఇచ్చింది. దీనిపై పలువురు

తిరిగి కోర్టును ఆశ్రయించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam