DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్తుల పాలిట ఆత్మీయ బంధువు మానవతావాది గంట్ల శ్రీనుబాబు

*వివేకానంద స్వచ్చంద సంస్థ కు రెండు నెలల్లో లక్ష విరాళం.*   

*ఆదర్శంగా నిలుస్తున్న పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి*   

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం పాతనగరంలో ఎంతో మంది అనాధలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ పలువురు కి

బాసటగా నిలిచిన శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా  సంస్థకు  గడచిన రెండు నెలల్లో లక్ష రూపాయలు తన వంతు  విరాళంగా అందజేయడం జరిగిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  అన్నారు.. సోమవారం డాబా గార్డెన్స్ విజేఫ్  ప్రెస్ క్లబ్ లో 25 వేల రూపాయలు చెక్ ను ఆ సంస్థ

అధ్యక్షుడు సూరాడ  అప్పారావుకు  శ్రీనుబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అనాధ ఆశ్రమానికి 50నుంచి 75 వేల రూపాయలు తాను  విరాళంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.. దీంతోపాటు మంచాలు... ఆయా సందర్భాల్లో నిత్యావసరాలు.. పౌష్టికాహారం అందజేస్తున్న మన్నారు,,. ఇక్కడ ఎంతోమంది

అనాధలు,  వృద్ధులు, నిరుపేదలు  ఆశ్రయం పొందుతున్నారని వారిని ఎంతో మంది దాతలు ఆదుకుంటున్నారని శ్రీను బాబు చెప్పారు. దీంతో తన వంతుగా ప్రతియేటా తనకు తోచిన రీతిలో తన సొంత నిధులతో ఈ సంస్థ కు  విరాళాలు అందజేయడం జరుగుతుందన్నారు.  కరోనా నేపథ్యంలో ఈ సాయం పెంచినట్లు చెప్పారు.. భవిష్యత్తు లో కూడా తన సాయం కొనసాగుతుందని

చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు ఉమాదేవి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam