DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 నుంచి ఆలయంలోనే జగన్నాధ ఉత్సవాలు. .

*నేత్రోత్సవంగా జగన్నాధ ఉత్సవాలు ప్రారంభం.*  

*ఏకాంతంలోనే జగన్నాధుని శోభా యాత్ర . .*

*విశాఖ వన్ టౌన్ జగన్నాధ్ ఆలయ ఈఓ శిరీష* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* ఆషాఢ శుద్ధ తదియ ను పురస్కరించుకుని జగన్నాధ స్వామి రథోత్సవ వేడుకలు

నేత్రోత్సవంతో అత్యంత నేత్రోత్సవంగా ఆరంభించినట్టు విశాఖపట్నం లోని వన్ టౌన్ జగన్నాధ స్వామి ఆలయ ఈఓ కె శిరీష తెలియచేసారు. సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉత్సవ వేడుకల్లో భాగంగా మహా శాంతి హోమం, పూర్ణాహుతి, కళాన్యాసం, తదుపరి నేత్రోత్సవం జరిగిందని తెలిపారు. సాయంత్రం ఉత్సవాలను శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి, తదుపరి సుభద్ర శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూర్తిగా ఏకాంతంగాలోనే వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

మంగళవారం ఉదయం 23 న 9 :30 గంటలకు నిర్వహించవలసిన రథయాత్ర కు ప్రత్యామ్నాయంగా

స్వామివారికి అర్చనాది కైంకర్యాలు శాస్త్ర ప్రకారం నిర్వహించి, ఆలయ ప్రాంగణం లోనే ఇంద్రద్యుమ్న వేదికను ఏర్పాటు చేసి, అక్కడే మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామి దర్శనం భక్తులకు అందిస్తామన్నారు. 

24 నుంచి జులై 3 వరకూ ప్రతి రోజు ఉదయం మేలుకొలుపు, నాదస్వరం, నిత్యార్చన, బాలభోగం, భక్తుల ఉభయుల గోత్రనామములతో అర్చనంతరం

సాయంత్రం 6 :30 గంటల వరకూ భక్తులకు దర్శనం లభిస్తుందన్నారు. 

ఉత్సవాల్లో 10 రోజుల పాటు నిర్వహించే నిత్యా అర్చనలు రూ. 300 చెల్లించి, తగు రసీదు తీసుకుని, గోత్ర నామములతో స్వామి సేవ పొందవచ్చన్నారు. ఆన్ లైన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోదలచిన వారు 9951139429 నెంబర్ ను సంప్రదించవచ్చన్నారు. బ్యాంకు అకౌంట్ నెంబర్ :060810011013373 , IFSC code :

ANDB0000608 , ఆంధ్ర బ్యాంకు ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam