DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి అమలాపురంలో మళ్లీ లాక్‌ డౌన్‌ అమలు

*ఉదయం 6 నుంచి 10 వరకే తిరిగేందుకు అనుమతి.* 

*మద్యం షాపుల నిర్వహణ విషయంలో ప్రొసీడింగ్స్‌* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిధిలో మరొకసారి లాక్ డౌన్ నిబంధనలు అమలు లోకి వస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

కొవిడ్‌-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో శనివారం రాత్రి అమలాపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో మరణించిన నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డివిజన్‌ స్థాయిలో కొవిడ్‌-19 కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.  కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంతో పాటు అమలా పురం రూరల్‌,

అయినవిల్లి మండలాల్లో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, అదనపు డీఎం హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ పుష్కరరావులతో చర్చించి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలను తెరుచుకోవచ్చు. ఆ

తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మద్యం షాపుల నిర్వహణ విషయంలో ప్రొసీడింగ్స్‌ ఇస్తామని తెలిపారు. కాగా అమలాపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు తమ కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ అమలు చేయాలని చేసిన సూచనతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం పట్ల

చిరు వ్యాపారుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాల్సిందేనని, లేనిపక్షంలో ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తామని ఆర్డీవో హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam