DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 నుండి లాక్ డౌన్ అమలు, నిబంధనలు ఇవే: ఆర్డిఓ

\*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  23, 2020 (డిఎన్ఎస్):*  ఈ నెల 25 వ తేదీ నుండి ప్రజా రవాణా, వర్తకం, వాణిజ్యం కు సంబంధించి యధాతథంగా ఉదయం 6.00 గంటల నుండి 10.00 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉంటుందని అమలాపురం ఆర్.డి. ఓ తెలిపారు. రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ కూడా ఉదయం 6.00 గంటల నుండి, 10.00 గంటల వరకు మాత్రమే

పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఆరోగ్య సంబంధ విషయాలకు సంబంధించి మెడికల్ షాపులు, ప్రభుత్వ, మరియు ప్రైవేట్ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని అయితే సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం తప్పనిసరని ఆయన తెలిపారు. పాఠ శాలలు, కళాశాలలు, తదితర విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు పూర్తిగా మూసి వేయడం జరుగుతుందని ఆర్.డి. ఓ

పేర్కొన్నారు. రెస్టారెంట్లు,హోటల్స్ నుండి పార్సెల్ ఉదయం 11.00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని, మెడికల్ ఎమర్జెన్సీ తప్ప అమలాపురం డివిజన్ నుండి బయట ప్రాంతాలకు వెళ్లేందుకు  ఎటువంటి పాస్ లు జారీ చేయడం జరగదని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం,పాన్,గుట్కా,పొగాకు వంటివి పూర్తిగా నిషే ధమని, మద్యం షాపులు

అమలాపురం డివిజన్ లో యధావిధిగా ఉదయం 6.00 గంటల నుండి 10.00 గంటల వరకు పని చేస్తాయని ఆర్.డి. ఓ తెలియ చేశారు. వీధి వ్యాపారులు ఉదయం 10.00 గంటలు తరువాత బయట తిరగడం పూర్తిగా నిషేదమని ఆర్.డి. ఓ పేర్కొన్నారు.
కంటైన్ మెంట్ జోన్ లో తప్ప మిగిలిన ప్రాంతాలలో ఈ క్రింది విషయాలు ప్రజలు గమనించాలని ఆర్.డి. ఓ సూచించారు.

1. జిల్లా ల మధ్య

రవాణా  నిషేదం.
2. కంటైన్ మెంట్ జోన్ లోతప్ప    ప్రభుత్వకార్యాలయాలు , ప్రైవేట్ కార్యాలయాలు పనిచేస్తాయి.
3. కంటైన్ మెంట్ జోన్ లో తప్ప నిర్దేశించిన సమయం లో బ్యాంకులు పనిచేస్తాయి.
4.  ఫంక్షన్స్, ఈవెంట్స్, తక్కువ మంది తో జరుపుకోవాలి.
5.  వివాహాలు నిర్ణీతసంఖ్యతో జరుపుకోవడానికి అనుమతి సంభందిత మండల తహశీల్దార్

నుండి పొందాలి. మాస్క్ లు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి.
6. పబ్లిక్ ప్రదేశాలలో గాని, వర్కింగ్ ప్రదేశాలలో గాని మాస్క్ లు ధరించక పోతే పట్టణాల లో అయితే 100 రూపాయలు, గ్రామీణ ప్రాతాల్లో అయితే 50 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.
7. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
8. గుపులు గా తిరగడం నిషేదం.
9.

అంత్య క్రియలకు 20 మంది కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు. మాస్క్ లు, సామాజిక దూరం తప్పనిసరి.

పైన తెలిపిన నిబంధనలు జిల్లా కలెక్టర్, మరియు భారత ప్రభుత్వ గృహ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 25 వ తేదీ నుండి అమలు లోకి వస్తాయని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. పై నిబంధనలు అమలాపురం డివిజన్ లో మరింత ఖటినంగా అమలు చేయడం జరుగు తుందని

ఆర్.డి. ఓ తెలియ చేశారు.
ఉదయం 10.00 గంటలు తరువాత ఒక గంట గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుందని, 11.00 గంటల నుండి సంపూర్ణంగా లాక్ డౌన్ అమలు లో వుంటుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam