DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకాంతంలోనే రథయాత్ర, భక్తులకు దర్శనం మాత్రమే

*విశాఖ లో ప్రారంభమైన జగన్నాధ ఉత్సవాలు..*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  23, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని వన్ టౌన్ లో గల శ్రీ జగన్నాధుని వార్షిక ఆషాఢ మసోత్సవాలు పూర్తిగా ఏకాంతం లోనే నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రథయాత్ర ను పూర్తి గా రద్దు చేసి,

కేవలం ఆలయం లోనే అర్చకులు, సిబ్బంది సహకారంతో నిర్వహించినట్టు ఆలయ ఈఓ కె. శిరీష తెలియచేసారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ఆరంభమైన ఉత్సవాలు గతం లో నిర్వహించిన రీతిలో కాక, ఏకాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖలు ఇచ్చిన ఆదేశాల మేరకు భక్తులను కేవలం దర్శనానికి మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. రక్షణ చర్యలు

అన్ని నిబంధనల ప్రకారమే చేపట్టామన్నారు. 
ఉదయం 9 :30 గంటలకు జగన్నాధ స్వామికి సింహాసనం ఏర్పాటు చేసి, రధాంగపూజ, పుణ్యాహవచనం, కుంభ బలిహరణ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం స్వామికి విశేష అర్చన, చతుర్వేద పారాయణ పఠనం అత్యంత వైభవంగా సాగిందన్నారు. ఆలయంలోనే ఏర్పాటు చేసిన ఇంద్రద్యుమ్న వేదిక పై స్వామిని వేంచేపు చేసి,

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఈ వేడుకలు జులై 3 వరకూ ఆలయంలోనే ఇదే ప్రాంగణం లో నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం వరకూ దర్శనం లభిస్తుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam