DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ నుంచి వైకాపాలోకి వలసలు.. చొక్కాకులతో  మొదలు. 

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): భారతీయ జనతాపార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినందున తానూ తిరిగి వై

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు చొక్కాకుల వెంకట రావు తెలిపారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ తానూ వై ఎస్ జగన్ ప్రకటించిన నవ రత్నాలతో ప్రభావితం అయ్యి, పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశం లో విశాఖపట్నం నగర

అధ్యక్షులు మళ్ల విజయ్ ప్రసాద్, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
గతం లో 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర

నియోజక వర్గ శాసన సభ అభ్యర్థిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం డజన్ల కొద్దీ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు వారిలో పార్టీకి మొదట నుంచి బలోపేతానికి కృషి చేసిన

జివి రవిరాజు ఒకరు. అయన కు ఈ నియోజకవర్గం లో మంచి పట్టు ఉంది. క్రీడాకారులు, మాజీ కార్పొరేటర్, దాదాపుగా అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ని కాదని

ఎవరికీ తెలియని అనామకులు చొక్కాకుల వెంకట రావు కు ఏరికోరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ టికెట్ ఇచ్చారు. దీంతో అయన ఎన్నికల ప్రచారానికి రంగం సిద్దం

చేసుకున్నారు. దీంతో అలిగిన రవిరాజు, అయన అనుచరులు, ఇతర ప్రముఖులు పార్టీని వీడి బీజేపీ లో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ మారి బీజేపీ లోకి

వెళ్లిపోయారు. à°¸à°°à°¿à°—్గా నాలుగేళ్ల తర్వాత అదే  à°šà±Šà°•à±à°•à°¾à°•à±à°²  à°µà±†à°‚కటరావు  à°®à°³à±à°³à±€ ఇప్పుడు అదే వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేందుకు రావడం గమనార్హం. అంటే

గతం లో పార్టీకి ఇతను చేసిన తప్పిదం మరిచి పోక ముందే మళ్ళీ పార్టీ లో చేరడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam