DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ కంటైన్ మెంట్, బఫర్ జోన్ల లోనే, జిల్లా మొత్తం లేదు

*కరోనా కట్టడికి కఠిన చర్యలను కచ్చితంగా అమలు చేస్తాం:* 

*జిల్లా మొత్తం కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్ మురళీధర్ రెడ్డి.* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  24, 2020 (డిఎన్ఎస్):* కరోనా కట్టడికి జిల్లా లో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా

కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలియచేస్తున్నారు. అయితే లాక్ డౌన్ జిల్లా అంతటా వర్తించదని, కంటెంట్మెంట్ జోన్లు, బఫర్ జోన్ లుకు మాత్రమే లాక్ డౌన్ అమలు లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాలు యధా విధి గా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

జిల్లాలో ఆరువేల పడకలతో 3 కోవిద్ కేర్ సెంటర్ లు /

జిల్లాలోని బొమ్మూరు

లోని కోవిద్ కేర్ సెంటరు ను బుధవారం నాడు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ లు రాజకుమారి, కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అభిషి క్త్  కిషోర్ లతో కలిసి పరిశీలించారు. సిబ్బంది గదులు,  పరీక్షల గదులు లేబరేటరీస్, ఫార్మసీ, స్టోర్స్, ఎక్విప్మెంట్,  అక్కడ ఏర్పాటు

చేసిన  ఈట్& జనరల్ స్టోర్స్ కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు గతంలో విధించిన లాక్ డౌన్ సడలింపు అనంతరం జిల్లాలో కేసులు సంఖ్య పెరిగిందని అయితే ప్రభుత్వం చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలు వలన కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోగల మని అన్నారు, బొమ్మూరు లోని కోవిద్ కేర్

సెంటర్ మాదిరిగా జిల్లాలో మరో రెండు చోట్ల అనగా అమలాపురం కాకినాడ లో ఏర్పాటు చేసి, 6 వేల పడకలు లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తుందని దీనిలో  3000 పడకలు బొమ్మూరు కోవిద్ కేర్ సెంటర్ లో, అమలాపురం 1500, కాకినాడ 1500 అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ చర్యలు తో పాటు ప్రజల సహకారం ఉండాలన్నారు.

సామాజిక దూరం, మాస్కులు ధరించటం చేతులు శుభ్రపరచడం తప్పనిసరి అన్నారు.

జిల్లా లాక్ డౌన్  విషయంలో మార్పులు వివరిస్తూ కంటెంట్మెంట్ జోన్ లో మాత్రమే పూర్తి లాక్  డౌన్ ఉంటుందని, బఫర్ జోన్ నందు ఉదయం 6 to 10 సడలింపు, మిగిలిన ప్రాంతాల్లో యధావిధి (లాక్ డౌన్ లేని ) పరిస్థితులు ఉంటాయన్నారు. జిల్లాలో 165 కంటెంట్మెంట్ జోన్లు

ఉన్నాయి అన్నారు. జిల్లాలో 100 హోమ్ క్వారంటైన్ లు నిర్వహిస్తున్నారని అన్నారు, ప్రజలు స్వచ్ఛందంగా కోవిద్ 19 టెస్టులు చేయించుకోవాలని పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆందోళన పడవలసిన అవసరం లేదని హోమ్ క్వారంటైన్ లు నందు వైద్య సదుపాయాలు అందజేయడం జరుగుతుందన్నారు. 

ఈ సందర్భంగా రిలయన్స్ సంస్థ వారు బొమ్మూరు కోవిద్ కేర్

సెంటర్ కు సిబ్బంది,  పేషెంట్లకు సౌకర్యార్థం 1000 ప్లాస్టిక్ కుర్చీలను ఇస్తూ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వారికి రిలయన్స్ సంస్థ ప్రతినిధి పి సుబ్రహ్మణ్యం అందజేశారు. 

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా అర్బన్ ఎస్పీ షిమోషి బాజిపేయి, ట్రైనీ కలెక్టర్ అపరాజిత సిన్ సిన్హార్, అమలాపురం ఆర్డీవో భవాని శంకర్,

అమలాపురం మున్సిపల్ కమిషనర్ కె వి వి ఆర్ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, రూరల్ ఎండిఓ సుభాషిని, రూరల్ తహసిల్దార్ హుస్సేన్, తదితరులు జిల్లా కలెక్టర్ తో ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam