DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా వ్యాప్తంగా అవినీతి రహిత కార్యాచరణ సాగించాలి

*పగో జిల్లా ఎస్పీ కి  సీఎం వైఎస్ జగన్, డిజిపి ల సూచన* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  24, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె.ఎన్. నారాయణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి

మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో అవినీతి రహిత  పాలన సాగించాలని, అవినీతి ఏ స్థాయిలో ఉన్న కఠినంగా వ్యవహరించి, అవినీతి నిర్మూలన కొరకు కృషి చేయాలని ఎస్పీ కి సూచించారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ ని అమలు చేసే ప్రక్రియలో ఏ స్థాయిలో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక పాలసీ అమలు లో భాగముగా

కఠినంగా వ్యవహరించాలని, పశ్చిమగోదావరి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు పట్ల ఉక్కుపాదం మోపాలని రౌడీ ల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రజాశాంతి భంగం కలిగించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. 

అనంతరం ఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి  గౌతమ్ సవాంగ్ ని కూడా కలిసి పలు విషయాలపై సూచనలు

తెలుసుకున్నారు. దిశ చట్టం అమలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టు ద్వారా నియంత్రించాలని, ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం కలిగించే నాటుసారా తయారీదారులు పై, నాటు సారా అక్రమ రవాణా దారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, నేషనల్ హైవే మరియు ఇతర రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల పట్ల పక్కా ప్రణాళికలతో రహదారి ప్రమాదాలు

నివారించాలని, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరియు  అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పి కి సూచనలు ఆదేశాలు ఇచ్చినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam