DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగుల వేతన క్లైములలో మార్పు: ఖజానా డిడి నిర్మలమ్మ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 24, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖల అన్నిరకాల క్లైములను సి.ఎఫ్.ఎం.ఎస్  నుండి హెచ్.సి.ఎంకు మార్పుచేయడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ఖజానా శాఖ  ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక

ప్రకటన విడుదల చేసారు. సి.ఎఫ్.ఎం.ఎస్ – ఫేజ్ 2లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యములు, అన్ని రకాల క్లైములను హెచ్.సి.ఎంకు మార్పుచేయడం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో               రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు డేటాలను కూడా హెచ్.సి.ఎంకు మార్పుచేయబడుతుందని చెప్పారు. ఇటీవల పదవీవిరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల

పింఛను పత్రాలు కూడా నూతన విధానంలో ( హెచ్.సి.ఎం ) డేటా చేయాల్సి ఉందన్నారు. కావున జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు తమ వద్ద పదవీవిరమణ పొందిన ఉద్యోగులను సి.ఎఫ్.ఎం.ఎస్ లాగిన్ లోకి వెళ్లి రిటైర్మెంట్ అని కొట్టి సపరేషన్ చేయాలన్నారు. అనంతరం మీ పరిధిలో గల సహాయ లేదా ఉప ఖజానాధికారులకు తెలియజేయాల్సిఉందని ఆమె డ్రాయింగ్ అధికారులను

కోరారు. 
ఈ నూతన విధానంలో పింఛన్లు చేయుటకు కొంత సమయం పడుతుందని, కావున పింఛనుదారులు ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఈ విషయమై జిల్లాలో నూతనంగా పదవీవిరమణ పొందిన ఉద్యోగులు వారి పరిధిలోని  సహాయ / ఉప ఖజానాధికారులకు సంప్రదించగలరని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam