DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయుల పిల్లలకు విజెఎఫ్ విద్యా పురస్కారాలు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  24, 2020 (డిఎన్ఎస్):*  విద్యారంగంలో విశేష ప్రతిభను కనబరిచే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫోరం అధ్యక్షులు, స్కాలర్ షిఫ్ కమిటీ ఛైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ప్రతీ ఏడాది

మాదిరిగానే ఈ ఏడాది కూడా మీడియా మిత్రుల పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రతిభకు ప్రోత్సాహం పేరిట జరిగే కార్యక్రమంలో ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బుధవారం డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల  సమావేశంలో

శ్రీనుబాబు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రతిభ కనబర్చిన బాలలకు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. 
ఈ స్కాలర్షిప్ కోసం ఎల్.కె.జీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో అర్ధ సంవత్సరం (ఆఫ్ ఇయర్లీ) మార్కుల జాబితాలను, వీజెఎఫ్ సభ్యత్వ వివరాలను

తెలియజేస్తూ జూలై నెలాఖరులోగా డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు దరఖాస్తులను అందజేయాలని కోరారు.  స్కాలర్ షిట్ కమిటీలో టి.నానాజీ, పి.ఎన్.మూర్తిలు ఉప ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.. ఇక మీడియా అవార్డుల కమిటీకి ఆర్. నాగరాజు పట్నాయక్ ఛైర్మన్‌గా, దాడి రవికుమార్ ఉప ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలంగా

ఉన్నట్లు అయితే ఆగస్టు నెలాఖరులోనే స్కాలర్ షిప్ లను అందజేస్తామన్నారు. 
ఈ కార్యక్రమంలో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు, మీడియా అవార్డుల కమిటీ ఛైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్, ఉపాధ్యక్షలు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పిఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, పి.వరలక్ష్మి, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్,

దొండా గిరిబాబు, పి.దివాకర్ రావు, మాధవరావు, డేవిడ్, గయాజ్, శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam