DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కూర్మావతారం లో జగన్నాధుని వాత్సల్య అనుగ్రహం

*విశాఖ లో వైభవంగా సాగుతున్న జగన్నాధ ఉత్సవాలు..*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూన్  25, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని వన్ టౌన్ కొత్తరోడ్డు లో గల శ్రీ జగన్నాధ స్వామీ ఆలయ వార్షిక ఆషాఢ మసోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురు వారం జగన్నాధుడు కూర్మావతారం లో భక్తులను

అనుగ్రహిస్తున్నాడు. ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాధాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం స్వామికి నిత్యారాధనలు, విశేష అలంకారాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నట్టు ఆలయ ఈఓ కె. శిరీష

తెలియచేసారు.

 

మంగళవారం దేశ వ్యాప్తంగా ఆరంభమైన ఉత్సవాలు గతం లో నిర్వహించిన రీతిలో కాక, ఏకాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖలు ఇచ్చిన ఆదేశాల మేరకు భక్తులను కేవలం దర్శనానికి మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. రక్షణ చర్యలు అన్ని నిబంధనల ప్రకారమే

చేపట్టామన్నారు. 

దశావతార వైభవ ప్రదర్శన: . .. 

ప్రతి ఏటా వార్షిక ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఘట్టం దశావతార అలంకార దర్శనం.  జగన్నాధునికి రోజుకొక అవతారం లో పది రోజుల పాటు దశావతారాలను అలంకరించి, భక్తులకు అమితానందాన్ని కల్గించడం ఆలయ వైశిష్ఠ్యంగా వస్తోంది. ఏటా వేలాది గా భక్తులు స్వామిని

దర్శించుకునే భాగ్యానికి నోచుకున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భక్తుల రాక ను కొంత కట్టడి చేయడం జరిగింది. అయినప్పటికీ భక్తజనం స్వామి సేవలో తరిస్తున్నారు. 

ప్రత్యేక ఆరాధనలు, నిత్యా అర్చనలు అనంతరం ఉదయం 6 :30 గంటల నుంచి మత్సావతర అలంకారంలోని  జగన్నాధ స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. ఈ

వేడుకలు జులై 3 వరకూ ఆలయంలోనే ఇదే ప్రాంగణం లో నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం వరకూ దర్శనం లభిస్తుందన్నారు. 

ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామి వరాహ అవతారం లో దర్శనం అనుగ్రహించనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam