DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26 న ఆర్ధిక మంత్రి ఏపీ బీజేపీ వర్చువల్ ర్యాలీ లో ప్రసంగం

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  25, 2020 (డిఎన్ఎస్):* భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మూడవ వర్చువల్ బహిరంగ ర్యాలీని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ దీనికి  ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ నాయకులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ డిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వార పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి కేంద్రంనుండి చేసిన ఆర్థిక సహకారం, భవిష్యత్ లో ఆత్మనిర్భర భారత్ నుండి చేపట్టనున్న ఇతర ఫతకాలతో పాటు నూతన సహకారం గురించి

 వివరించనున్నారన్నారు. 

రాష్ట్ర లో అమలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ ఫతకాలతో పాటు రాష్ట్రలో వై,యస్,ఆర్ ప్రభుత్వం కేంద్ర ఫతకాలపేర్లు మార్చడం,ప్రజావ్యత్రిరేక నిర్ణయాలు సైతం ప్రజలకు వివరిస్తామన్నారు. 

బిజెపి రెండోసారి అధికారంలో మొదటి సంవత్సరం అభివృద్ధిని ఆంద్ర రాష్ట్ర ప్రజలకు

 తెలియజేయడానికి ఈ ప్రధానంగా ఈ సభలును నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ఈ ర్యాలీలోఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ గారితో పాటు అద్యక్షులు కన్నా గారితో పాటు అఖిలభారత బీజేపీ కార్యదర్శి సత్య కుమార్ ,రాష్ట్ర  వ్యవహారాల ఇంచార్జీ సునిల్ దియోదర్  ,యంపి,జీ వి యల్ నరసింహరావు ,యంయల్ సీ,లు సోము వీరరాజు, మాదవ్

తోపాట ఇతర రాష్ట్ర నేతలు పాల్గొనబోతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

 రాష్ట్రవ్యాప్తంగా భూతికదూరం పాటిస్తూ 30 చోట్ల యల్ఇడి ,తెరలను ఎర్పాటు చేస్తున్నామన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam